Naga Chaitanya : అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే కొంతకాలం క్రితం నాగ చైతన్యను ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎప్పుడైతే సమంతతో లవ్ అంటూ పాపులర్ అయ్యాడో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈయన పేరు మారుమ్రోగిపోతుంది. కొందరేమో హీరోయిన్ మొగుడుగా పాపులర్ అయ్యావంటారు.. కొందరేమో నీ తండ్రి పేరుతో పాపులర్ అయ్యావు అంటారు.
అయితే రీసెంట్ నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దానికి కారణం సినిమా షూటింగ్ ఆగిపోవడమే. నాగచైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ బైలింగ్వల్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో గ్రాండ్ గా ప్రారంభమైంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మేలుకోట సమీపంలో రాజగోపురం దగ్గర మద్యం విక్రయ కేంద్రం సెట్ వేశారు. అయితే పవిత్ర ప్రదేశంలో ఇలా మద్యం సెట్ వేయడంపై అక్కడి స్థానికులు చిత్ర బృందంపై ఫైర్ అయ్యారు. అంతేకాదు సెట్ ని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న సినిమా సిబ్బందిని పరిగెత్తించి కొట్టారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య కూడా అక్కడే ఉన్నారని ఆయన కూడా పరుగులు పెట్టి అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది. నిజానికి షరతులతో చిత్రీకరణకు అనుమతి ఇవ్వగా చిత్ర యూనిట్ దాన్ని ఉల్లంఘించిందని స్థానిక కన్నడ సంఘ ప్రతినిధులు విమర్శించారు. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా సరే సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య టైం అస్సలు బాగాలేదని ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ అవుతుందని నెటిజన్స్ అంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…