Sid Sriram : తెలుగు సినీ ఇండస్ట్రీ లో పరిచయమే అవసరం లేసి సింగర్ సిద్ శ్రీ రామ్. తన పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సిద్ శ్రీ రామ్ పాడిన పాటలలో దాదాపుగా అన్ని పాటలూ హిట్ అవ్వడమే కాకుండా యూట్యూబ్ లో ట్రెడింగ్ లో నిలుస్తున్నాయి. సిద్ పాడిన పాటలకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని మనకు తెలుసు. సిద్ పాడిన పాటలు సినిమాలకే క్రేజ్ ను తీసుకు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. దీంతో చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సినిమాల్లో సిద్ శ్రీ రామ్ పాట ఒకటైనా ఉండేలా చూసుకుంటున్నారు.
హీరోలు సైతం వారి సినిమాల్లో సిద్ పాట ఉండేలా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. దీంతో తనకు వచ్చిన ఈ క్రేజ్ ను ఉపయోగించి సిద్ శ్రీ రామ్ తన రెమ్యూనరేషన్ ను రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క పాటకు గాను సిద్ రూ. 6 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ రూ.6 లక్షలకు జీఎస్టీని కూడా నిర్మాతే చెల్లించాల్సి ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ కి ఇచ్చిన బడ్జెట్ లోనే సిద్ శ్రీ రామ్ పాట కచ్చితంగా ఉండేలా షరతు విధిస్తున్నారని, దీంతో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ లు సినిమా కోసం ఎంత కష్టపడినా వారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు మిగలడం లేదని తెలుస్తోంది.
కొందరు హీరోలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కు సిద్ పాట సినిమాలో కచ్చితంగా ఉండాలని షరతు విధిస్తున్నారని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. సిద్ పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఫర్వాలేదు. కానీ ఈ పాటలు ఆకట్టుకునే రీతిలో ఉండకపోతే అవి వైరల్ గా మారవు. దీంతో సిద్ పాట పాడినా సినిమాకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక పాటలు పాడే విషయంలో సిద్ను ఎంపిక చేసినా.. వాటి లిరిక్స్.. సంగీతం.. విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. అలా చేస్తేనే పాట హిట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక సిద్ తన రెమ్యూనరేషన్ నుపెంచుకుంటూ పోతే అది తన భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…