Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డె ప్రస్తుతం పలు వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంది గతేడాది ఈమె నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ అమ్మడికి ఒక్కో మూవీ షాక్ను ఇస్తోంది. మొదట రాధేశ్యామ్, తరువాత బీస్ట్, ఇటీవల ఆచార్య మూవీలు అట్టర్ఫ్లాప్ అయ్యాయి. వీటిల్లో బీస్ట్ కాస్త ఫర్వాలేదనుకున్నా.. రాధేశ్యామ్, ఆచార్య మాత్రం బాగా నిరాశ పరిచాయి. దీంతో పూజా హెగ్డెకు మళ్లీ ఐరన్ లెగ్ అన్న ముద్ర తిరిగి వచ్చేసింది. అయితే ఈమెకు ఇప్పటికప్పుడు వచ్చే నష్టం ఏమీ లేకున్నా.. ఈమె ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో అవి హిట్ అవ్వాలని కోరుకుంటోంది. లేదంటే పూజాకు మళ్లీ కెరీర్ ప్రారంభ రోజులు వస్తాయని అంటున్నారు.
అయితే తాజాగా ఈ అమ్మడు తెలుగు, హిందీలో పలు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వాటిల్లో పూరీ జగన్నాథ్ జేజీఎం (జనగణమణ) ఒకటి. దీనికి గాను ఈ అమ్మడు ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ను తీసుకుంటోందట. అదే జరిగితే తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీ ఎత్తున రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లు ఎవరూ లేరు. దీంతో పూజా హెగ్డె పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రూ.5 కోట్లలో రూ.4 కోట్లు తన రెమ్యునరేషన్ కాగా.. రూ.1 కోటి తన స్టాఫ్ శాలరీలు, ఇతర ఖర్చులకు వసూలు చేస్తోంది.
ఇక ఇదే కాకుండా ఈమె త్వరలోనే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మూవీలో చేయనుంది. అలాగే హిందీలోనూ రెండు ప్రాజెక్ట్స్కు ఓకే చేసింది. దీంతోపాటు పవన్తోనూ ఓ మూవీ చేయనుంది. అయితే దీని గురించి మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. పూజా హెగ్డె రెమ్యునరేషన్ పెరగడం మాత్రం విశేషమనే చెప్పాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…