హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సంపదలకు నెలవైన లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే ఎంతో శుభం ఫలితం కలుగుతుందని భావిస్తారు భక్తులు. లక్ష్మీదేవి కృప ఉంటేనే ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అదేవిధంగా కీర్తి, సంపద పెరిగి ఉన్నత స్థానానికి వస్తారని పండితులు వెల్లడిస్తుంటారు. శుక్రవారం నాడు కచ్చితంగా ఈ నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ అనుగ్రహం లేకుండా ఎలాంటి సంపద మనకు చేకూరదు. సంపద కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు రోజు మొత్తం ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం సమయంలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చామంతి పుష్పాలతోనూ, పసుపు కుంకుమతోనూ లక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తూ అర్చన చేయాలి. ఆవు పాలు, బెల్లంతో పరమాన్నం వండి నైవేద్యంగా సమర్పించాలి. వెండి లేదా రాగితో తయారు చేసిన శ్రీ యంత్రాన్ని పూజ కథలో పెట్టుకొని ఆరాధించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.
లక్ష్మీదేవి ఆరాధనలో యంత్రాలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా లక్ష్మీకటాక్షం ఎంతగానో అవసరం. ఇందుకోసం మహా లక్ష్మీ యంత్రం, వ్యాపార అభివృద్ధి యంత్రం, కుబేర యంత్రం, శ్రీ యంత్రాలను పూజించడం ద్వారా సంపద అన్నది అభివృద్ధి చెందుతుంది.
లక్ష్మీదేవి మాదిరిగానే కుబేరున్ని కూడా సంపదకి అధిపతిగా భావిస్తారు. కుబేరుని విగ్రహాన్ని వ్యాపార స్థలంలో ఉంచుకోవడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంటి సింహ ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి లక్ష్మీ సహస్రనామాలు చదవడం ద్వారా ఆర్థిక బాధల నుంచి బయటపడి లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనం సంపాదిస్తారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…