హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా తన శరీరాన్ని ఒక మహిళకు చూపుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో కాల్ రికార్డింగ్ లీక్ అవడం వల్ల వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులుగా అటు సోషల్ మీడియాలో ఇటు టీవీ, ప్రింట్ మీడియాలోనూ ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీని వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఈ విషయంలో సదరు ఎంపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ మాధవ్ ఆ వీడియో కాల్ ద్వారా ఏ మహిళని లైంగిక వేధింపులకు గురి చేయలేదని, ఒకవేళ చేస్తే ఎవరైనా తన మీద కంప్లైంట్ చేశారా.. అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ప్రైవేటుగా ఆ వీడియోలో ఉన్నట్టుగా చేసుకోవడంలో తప్పేముందని అన్నారు. అయితే ఆయన చేసిన ఈ వాఖ్యలు.. వివాదం మొదలైన రోజు పార్టీ చెప్పినట్టుగా.. ఆ వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన దానికి విరుద్దంగా ఉన్నాయి. దీంతో ఎంపీ మాధవ్ పై పార్టీ ఇక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.
కాగా ఎంపీ మాధవ్ కి ఇటువంటి వివాదాలు కొత్తేమీ కాదని చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు ఈయన అనంతపురం జిల్లాలో కదిరి సీఐగా పని చేశారు. ఆ సమయంలో ఆయన అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ప్రజలతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడని సమాచారం. అప్పట్లో ఈయనపై ఒక అత్యాచారం కేసు కూడా నమోదైందని మీడియాలో ప్రచారం అవుతోంది. ఇక భవిష్యత్తులో పార్టీ ఏం చేస్తుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…