Cricket : మన దేశంలో క్రికెట్కు ఉన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల సంఖ్యలో ఈ ఆటకు అభిమానులు ఉన్నారు. టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ను అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇక ఐపీఎల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ జరిగే సమయంలో టీఆర్పీ రేటింగ్స్ మొత్తం ఆ మ్యాచ్లకే వస్తుంటాయి. ఇలా క్రికెట్ ఎంతగానో పాపులర్ అయింది.
అయితే క్రికెట్ మ్యాచ్లు ఆడే సమయంలో ప్లేయర్లు.. ముఖ్యంగా బ్యాట్స్ మెన్ మధ్య మధ్యలో.. పిచ్ మీదకు వచ్చి బ్యాట్తో పిచ్ను టచ్ చేసి చూస్తుంటారు. ఈ విషయాన్ని చాలా మంది గమనించే ఉంటారు. అయితే బ్యాట్స్మెన్ అలా ఎందుకు చేస్తారో తెలుసా ? దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్మెన్లు కొన్ని సమయాల్లో పిచ్ మీదకు వచ్చి బ్యాట్తో పిచ్ను టచ్ చేసి వెళ్తుంటారు. పిచ్ మీద ఎక్కడైనా ఉబ్బెత్తుగా ప్యాచ్లు ఉన్నా.. రఫ్ ప్యాచ్లు ఉన్నా.. బ్యాట్తో అలా చేసి వాటిని సరి చేస్తారు. ఇక కొందరు బ్యాట్స్మెన్ అయితే అవసరం లేకున్నా ఎక్కువ సార్లు పిచ్ మధ్యలోకి వచ్చి అలా చేస్తుంటారు. దీంతో బౌలర్ రిథమ్ దెబ్బ తింటుందని, అతను సరిగ్గా బౌలింగ్ చేయలేడని.. బ్యాట్స్మెన్ భావన. అందుకనే బౌలర్ రిథమ్ను దెబ్బ తీసేందుకే కొందరు బ్యాట్స్మెన్ అలా చేస్తారు.
ఇక కొందరు బ్యాట్స్మెన్ అయితే టెన్షన్ కారణంగా ఈ విధంగా చేస్తుంటారు. పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్తో టచ్ చేసి పరిశీలించినట్లు చేసి ఒత్తిడిని తగ్గించుకుంటారు. అలాగే పిచ్ కండిషన్ గురించి తెలుసుకునేందుకు కూడా ఇలా చేస్తుంటారు. ఇక ఈ విధంగా బ్యాట్తో చేయడాన్ని గార్డెనింగ్ అని క్రికెట్ పరిభాషలో అంటారు. బ్యాట్స్మెన్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్తో గ్రౌండ్ను టచ్ చేసి పరిశీలించడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇవి అని చెప్పవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…