Chiranjeevi Pawan Kalyan : ఆరుపదుల వయస్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్గా తన 154వ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్లో మూవీ లాంచింగ్ కాగా, దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. పూరీ జగన్నాథ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
లాంచింగ్ తర్వాత చిత్రం నుండి పోస్టర్ విడుదల చేయగా, అందులో మాస్ అవతారంతో ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేసేలా పోస్టర్ని సిద్ధం చేశారు. డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభం కానుండగా, ఈ మూవీకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చిత్రంలో కీలక పాత్ర ఉండగా, ఆ పాత్రకి పవన్ కళ్యాణ్ని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామాలో చిరంజీవి వీరయ్య పాత్ర పోషిస్తుండగా, ఆయన సోదరుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్టు టాక్. ఈ చిత్ర దర్శకుడు బాబీ గతంలో పవన్తో కలిసి సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ని కలిసి పాత్ర గురించి వివరించే ప్రయత్నం చేశాడట బాబీ. పాత్ర నచ్చడంతో చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. ఇది కనుక నిజమైతే పవన్ అభిమానులకి పూనకాలే అని చెప్పాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…