Chiranjeevi – Meher Ramesh : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో నేటి తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాని కూడా మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
తమిళ వేదాళం రీమేక్ సినిమాకు తెలుగులో భోళా శంకర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయితే గతంలో షాడో, శక్తి వంటి సినిమాలను తెరకెక్కించి విఫలమైన మెహర్ రమేష్ కి ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉండటం చేత చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే ఈయన రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న మెహర్ రమేష్ నెల వారీ జీతంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నెలకు కేవలం ఐదు లక్షల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు. ఇక సినిమా విడుదలయ్యి లాభాలు వస్తే లాభాలలో 20 శాతం వాటా తీసుకోనున్నట్లు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ సందడి చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…