Chiranjeevi – Meher Ramesh : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో నేటి తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాని కూడా మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
తమిళ వేదాళం రీమేక్ సినిమాకు తెలుగులో భోళా శంకర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయితే గతంలో షాడో, శక్తి వంటి సినిమాలను తెరకెక్కించి విఫలమైన మెహర్ రమేష్ కి ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉండటం చేత చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే ఈయన రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న మెహర్ రమేష్ నెల వారీ జీతంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నెలకు కేవలం ఐదు లక్షల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు. ఇక సినిమా విడుదలయ్యి లాభాలు వస్తే లాభాలలో 20 శాతం వాటా తీసుకోనున్నట్లు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ సందడి చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…