Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తరువాత చేసిన చిత్రం.. ఆచార్య. ఇందులో రామ్ చరణ్ ఇంకో కీలకపాత్రలో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఏకంగా రూ.84 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. దీంతో కొరటాల, మెగాస్టార్, చరణ్ల కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా ఈ మూవీ నిలిచింది. ఇలాంటి సినిమాను ఎలా చేశారని కొరటాలను, మెగాస్టార్ను, చరణ్ను ప్రేక్షకులు చాలా విమర్శించారు. ఇక ఈ మూవీ రీసెంట్గా ఓటీటీలోనూ రిలీజ్ అయింది.
అయితే ఆచార్య మూవీకి ఓటీటీలోనూ పెద్దగా స్పందన లభించడం లేదు. దీనికి సరైన వ్యూస్ రావడం లేదు. దీంతో ఓటీటీలోనూ ఈ మూవీ నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి మరిచిపోయిన మెగాస్టార్, చరణ్, కొరటాల తమ తదుపరి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ గాడ్ ఫాదర్, బోళా శంకర్ షూటింగ్లతో బిజీగా ఉండగా.. చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక కొరటాల ఎన్టీఆర్తో కలిసి సినిమా చేస్తున్నారు. అయితే ఆచార్య మూవీని వారు మరిచిపోయారు కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం ఇంకా మరిచిపోలేదు. అందులో ఉన్న తప్పులు వెదికిమరీ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అందులో చిరంజీవి చేసిన ఓ తప్పును కొందరు ప్రేక్షకులు కనిపెట్టారు. దీంతో ఆయనను వారు ట్రోల్ చేస్తున్నారు.
ఆచార్య సినిమాలో రథం లాగే సీన్ ఒకటి ఉంటుంది. అందులో చిరంజీవి రథం లాగుతారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమాల్లో ఎవరూ పాదరక్షలను ధరించరు. కానీ చిరంజీవి అలా కాకుండా షూస్తోనే రథాన్ని ముందుకు తోశారు. దీంతో ఈ సీన్లో ఉన్న తప్పును వెదికిన కొందరు నెటిజన్లు చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఆలయాలపై సినిమా తీశామన్నారు.. అందులో చేసిన తప్పు గురించి ఆమాత్రం తెలియదా.. చెప్పులు వేసుకోకుండా దైవకార్యం చేయాలన్న సంగతి మరిచిపోయారా.. అంటూ చిరంజీవిని ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇక దీనిపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…