Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తరువాత చేసిన చిత్రం.. ఆచార్య. ఇందులో రామ్ చరణ్ ఇంకో కీలకపాత్రలో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఏకంగా రూ.84 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. దీంతో కొరటాల, మెగాస్టార్, చరణ్ల కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా ఈ మూవీ నిలిచింది. ఇలాంటి సినిమాను ఎలా చేశారని కొరటాలను, మెగాస్టార్ను, చరణ్ను ప్రేక్షకులు చాలా విమర్శించారు. ఇక ఈ మూవీ రీసెంట్గా ఓటీటీలోనూ రిలీజ్ అయింది.
అయితే ఆచార్య మూవీకి ఓటీటీలోనూ పెద్దగా స్పందన లభించడం లేదు. దీనికి సరైన వ్యూస్ రావడం లేదు. దీంతో ఓటీటీలోనూ ఈ మూవీ నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి మరిచిపోయిన మెగాస్టార్, చరణ్, కొరటాల తమ తదుపరి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ గాడ్ ఫాదర్, బోళా శంకర్ షూటింగ్లతో బిజీగా ఉండగా.. చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక కొరటాల ఎన్టీఆర్తో కలిసి సినిమా చేస్తున్నారు. అయితే ఆచార్య మూవీని వారు మరిచిపోయారు కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం ఇంకా మరిచిపోలేదు. అందులో ఉన్న తప్పులు వెదికిమరీ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అందులో చిరంజీవి చేసిన ఓ తప్పును కొందరు ప్రేక్షకులు కనిపెట్టారు. దీంతో ఆయనను వారు ట్రోల్ చేస్తున్నారు.
ఆచార్య సినిమాలో రథం లాగే సీన్ ఒకటి ఉంటుంది. అందులో చిరంజీవి రథం లాగుతారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమాల్లో ఎవరూ పాదరక్షలను ధరించరు. కానీ చిరంజీవి అలా కాకుండా షూస్తోనే రథాన్ని ముందుకు తోశారు. దీంతో ఈ సీన్లో ఉన్న తప్పును వెదికిన కొందరు నెటిజన్లు చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఆలయాలపై సినిమా తీశామన్నారు.. అందులో చేసిన తప్పు గురించి ఆమాత్రం తెలియదా.. చెప్పులు వేసుకోకుండా దైవకార్యం చేయాలన్న సంగతి మరిచిపోయారా.. అంటూ చిరంజీవిని ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇక దీనిపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…