Sudheer : జబర్దస్త్ అనగానే మనకు ముందుగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, అనసూయ, రష్మి.. ఇలా పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ వీరందరూ ఇప్పుడు జబర్దస్త్కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. యాంకర్లు అనసూయ, రష్మి తప్పించి ఇప్పుడు కమెడియన్లు అందరూ జబర్దస్త్ను వీడిపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ స్కిట్లలో కనిపించడం లేదు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపోసిడ్స్లోనూ సుధీర్ రావడం లేదు. దీంతో సుధీర్ స్టార్ మా చేస్తున్న ప్రోగ్రామ్లకు వెళ్లిపోయాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే జబర్దస్త్ లో కమెడియన్స్ కన్నా యాంకర్లకే రెమ్యునరేషన్ ఎక్కువ. సుధీర్కు ఇప్పటి వరకు అందులో ఎపిసోడ్కు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రెమ్యునరేషన్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ స్టార్ మా వారు దీనికి డబుల్ ఇస్తామని ఆఫర్ చేశారట. దీంతో స్టార్ మాకే సుధీర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తమ చానల్కు వచ్చేస్తే సుధీర్కు ఒక ఎపిసోడ్కు రూ.7 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారట. ఇప్పటికే స్టార్ మాలో యాంకర్గా చేస్తున్న అనసూయకు ఇస్తున్న మొత్తం కంటే ఇది ఎక్కువే. కనుక సుధీర్ గనుక పూర్తి స్థాయిలో స్టార్ మాకు వచ్చేస్తే అప్పుడు అనసూయకు షాక్ తగిలినట్లే అవుతుంది.
స్టార్ మాలో సూపర్ సింగర్స్ అనే షోతోపాటు కామెడీ స్టార్స్ కు కూడా సుధీర్ను అడుగుతున్నారట. కామెడీ స్టార్స్కు ఇప్పటికే నాగబాబు జడ్జిగా ఉన్నారు. అయితే సుధీర్ ఓకే చెప్పేసినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకనే జబర్దస్త్లో కనిపించడం లేదని సమాచారం. అయితే దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. ఏది ఏమైనా మల్లెమాలను వీడుతున్న జబర్దస్త్ కమెడియన్లు అందరూ మళ్లీ ఒక్క చోట చేరుతున్నారన్నమాట. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయన్న మాటను ఈ విధంగా వారు నిజం చేయబోతున్నారన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…