Childhood Photo : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి చిన్నది ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్. చూడడానికి అచ్చతెలుగమ్మాయిలా కనిపిస్తుంది. కానీ మళయాళీకి చెందిన ముద్దుగుమ్మ. ఈమె తండ్రి యాక్టర్ మరియు ప్రొడ్యూసర్. అంతేకాదు ఈమె తల్లి తెలుగులో చిరంజీవితో పున్నమినాగు సినిమాలో నటించింది. తెలుగులో అవకాశాలు రాకపోవడం వల్ల దక్షిణాదిలో వేరే భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మళయాళం అనే తేడా లేకుండా చిత్రాలు చేస్తూ మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత హీరో హీరోయిన్స్ తమ త్రో బ్యాక్ పిక్చర్స్ తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ పోస్ట్ చేసిన తన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల మహేష్ బాబుతో నటించి తన గ్లామర్ తో కుర్రకారు మతులు పోగొట్టేసింది. ఇంతకీ ఎవరు ఈ హీరోయిన్ అని ఆలోచిస్తున్నారా.. ఆమె ఇంకెవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్.
ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవం పోసింది కీర్తి సురేష్. మహానటి చిత్రానికి గాను నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత కీర్తి నటించిన మన్మథుడు 2, గుడ్ లక్ సఖి, రంగ్ దే చిత్రాలు ఆశించిన మేరకు విజయాలు సాధించలేకపోయాయి. ఇటీవల మహేష్ బాబు తో నటించిన సర్కారు వారి పాట చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటూ తన లేటెస్ట్ గ్లామరస్ లుక్ తో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ చూసేవారికి కనుల విందు చేస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…