Che guevara : చే గువేరా.. ఈ పేరు వినగానే యువత గుండెల్లో విప్లవ జ్వాలలు రగిలిపోతాయి. యువతకు చే గువేరా అంటే ఎంతో ఇష్టం. ఆయన నడిచిన బాటలో ప్రయాణించాలని యువత ఆలోచిస్తుంటారు. అందుకనే ఆయన బొమ్మలను దుస్తులపై, వాహనాలపై వేసుకుంటుంటారు. అయితే ఈ రోజు (అక్టోబర్ 9) వరకు చే గువేరా హత్య జరిగి 55 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఆయన రగిలించిన విప్లవ స్ఫూర్తి మాత్రం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
చే గువేరా విప్లవ పోరాట యోధుడు. ఆయనను ఎంతో మంది అభిమానిస్తారు. 1967, అక్టోబర్ 9న ఆయనపై కాల్పులు జరపగా చనిపోయారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఈ రోజును చే గువేరా వర్దంతిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
చే గువేరా 14 జూన్ 1928 న అర్జెంటీనాలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎర్నెస్టో చే గువేరా. ప్రజలు ఆయనను చే అని పిలుస్తారు. చే గువేరా మెడిసిన్ చదివినప్పటికీ ఆయన ఆ వృత్తి స్వీకరించలేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. విప్లవ మార్గాన్ని ఎంచుకుని ఏకంగా మోటార్ సైకిల్పై అప్పట్లోనే 10 వేల కిలోమీటర్లకు పైగా పర్యటనలు చేశారు. అనేక చోట్లకు ఆయన వెళ్లి పేదల పక్షాన పోరాడారు. వారికి సహాయం చేశారు. కార్మికుల పక్షాన నిలబడి గొంతెత్తి గళం వినిపించారు. పెట్టబడిదారి శక్తులను అణచివేసే దిశగా పోరాటాలు చేశారు.
చే గువేరా చనిపోయినా ఆయన చూపిన బాట ఎంతో మందికి ఆచరణీయం, అనుసరణీయం. ఎంతో మందికి ఆయన ప్రేరణగా నిలుస్తున్నారు. కనుక చే గువేరా కు జోహార్..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…