Pawan Kalyan : ఇటీవలి కాలంలో తెలంగాణలో చిన్నారి చైత్రపై హత్యాచారం సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిత్ర అనే ఆరేళ్ల అమ్మాయిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసు ఘటనపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అయింది. నిందితుడు రాజు చేసిన దారుణంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంచు మనోజ్, విజయశాంతి, పవన్ కళ్యాణ్ వంటి సెలబ్స్ చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించారు.
పవన్ కళ్యాణ్ స్వయంగా చిన్నారి ఇంటికి వెళ్లి బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిందితుడిని త్వరగా పట్టుకుని శిక్షించడమే కాకుండా.. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే తెలంగాణాలో తన పార్టీ మీట్ ఒకటి ఉన్నందున దానికి హాజరయ్యి ఈ క్రమంలో చైత్ర తల్లిదండ్రులకు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని పవన్ అందించారు. జనసేన పార్టీ ఈ విషయాన్ని తమ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
చిన్నారి చైత్రకు జరిగిన దారుణ ఘటనకు సంతాపం తెలియజేస్తూ రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయం చైత్ర తల్లిదండ్రులకు అందజేసి జనసైనికులతో కలిసి జనసేన అధినేత పవన్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. చిన్నారి కుటంబం పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారని జనసేన పార్టీ తమ ట్విట్టర్లో ప్రకటించింది. ఇక పవన్ కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వాన్ని బహిరంగ సభలలో, ట్విట్టర్ వేదికగా ఎండగడుతూ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ మాటల దాడికి వైసీపీ మంత్రులు సైతం ఘాటుగా స్పందించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…