RRR : పాన్ ఇండియా మూవీగా దాదాపుగా రూ.450 కోట్ల ఖర్చుతో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి పోటీగా భీమ్లా నాయక్, రాధే శ్యామ్ చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం పెద్ద బాంబ్ పేల్చింది. టికెట్స్ రేట్స్, బెన్ ఫిట్స్ షోస్, ఎక్స్ ట్రా షోస్ విషయ లో కీలక నిర్ణయం తీసుకుంది. బెన్ ఫిట్స్ షోస్, ఎక్స్ ట్రా షోస్ ఇ పై ఉండవు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే థియేటర్లలో తగ్గించిన టిక్కెట్ ధరలను అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. దీంతో టిక్కెట్స్ ద్వారా వచ్చే ఆదాయంలో రూ.25 కోట్ల నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపునకు వ్యతిరేకంగా డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయిస్తారని వార్తలు రాగా, ఇది ముందుగానే గ్రహించిన ప్రభుత్వం అత్యవసర ప్రకటనలు జారీ చేసింది.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం ముందు ఉన్న ఏకైక ఆప్షన్.. పవన్ కళ్యాణ్ సినిమాని పోస్ట్ పోన్ చేయించడమే. భీమ్లా నాయక్ విడుదలను కొన్ని రోజులు ఆలస్యం చేయమని పవన్ కళ్యాణ్ను ఒప్పించడానికి చంద్రబాబు మధ్యవర్తిత్వం తీసుకోబోతున్నారట. రాజమౌళికి చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో అమరావతి రాజధాని నగరానికి కొన్ని డిజైన్లు అందించి నాయుడుకి సహాయం చేశాడు.
ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను పోస్ట్ పోన్ చేసేందుకుగాను పవన్ కళ్యాణ్ను ఒప్పించడానికి రాజమౌళి అండ్ టీంకి ఉన్న ఏకైక ఆప్షన్ చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. రాజమౌళి రిక్వెస్ట్ చేస్తే నాయుడు నో అనరు. మరియు నాయుడు అభ్యర్థన చేస్తే, పవన్ కళ్యాణ్ కూడా నో చెప్పడు, అని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి, ఏం జరుగుతుందో..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…