Tollywood : గత కొద్ది రోజులుగా ఏపీలో టిక్కెటింగ్ వ్యవహారంతోపాటు ఇతర విషయాలపై కూడా గందరగోళం నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెటింగ్ వ్యవస్థ ఇష్ఠానుసారం ధరల్ని పెంచుకోవడాన్ని నియంత్రించ వచ్చని, ఒక సెక్షన్ నిర్మాతలు ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారు. తాజాగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని అన్నారు.
పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలాగే టిక్కెట్ రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతున్నారని, దానికి జీఎస్టీ ని కూడా వారు చెల్లించడం లేదని నాని అసెంబ్లీలో ఆరోపించారు. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోందని చెప్పారు.
టికెట్ల విక్రయం కోసం ఇండియన్ రైల్వేస్ వినియోగిస్తున్న ఐఆర్సీటీసీ తరహాలోనే సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం కారణంగా టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ , భీమ్లా నాయక్ , అఖండ , ఆచార్య , సర్కారువారి పాట , పుష్ప , రాధేశ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలపై ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. గతంలో ఈ బిల్లు విషయమై నిర్మాత డి.వి.వి.దానయ్య సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఈ విషయంలో కోర్టుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ బిల్లుపై ఏం చేస్తారనేది చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…