Carrot Oil : ప్రస్తుత ఆధునిక కాలంలో వాతావరణంలో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు, అలాగే చర్మ సమస్యలతో యువత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చర్మ సమస్యలను తగ్గించడం కోసం ముందుగా హోం రెమిడీస్ ఉపయోగించి.. ఆతర్వాత వైద్యులను సంప్రదిస్తుంటారు. అయినా కూడా కొంత మందికి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించినా కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ముఖంపై ఏర్పడే మొటిమలు, చర్మంపై ఏర్పడే రాషెస్ వంటి సమస్యలను తగ్గించడానికి క్యారెట్ ఆయిల్ ఎంతో సహాయపడుతుంది. స్వచ్చమైన నూనెలలో క్యారెట్ ఆయిల్ కూడా ఒకటి. క్యారెట్ ఆయిల్ తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల చర్మ వ్యాధులను నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. క్యారెట్ ఆయిల్ లో ఎక్కువగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా చర్మంపై ఉండే చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. ఈ నూనె వలన చర్మానికి ఎలాంటి హాని ఉండదు.
అదేవిధంగా మానసిక స్థితిని మెరుగుపరచడానికి క్యారెట్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ఎక్కువగా ఆరోమాథెరపీలో ఉపయోగిస్తారు. ఆరోమాథెరపీలో ఉపయోగించడం వలన ఆందోళన, ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మం మంట సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ నూనె శోథ నిరోధక లక్షణాలను తొలగించడమే కాకుండా మొటిమలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మన చర్మసౌందర్యానికి క్యారెట్ ఆయిల్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. క్యారెట్ ఆయిల్ 5 నుంచి 10 చుక్కల వరకు 5 టేబుల్ స్పూన్ల వేడినీటిలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేసి పేస్టులా రెడీ చేసుకోవాలి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. మొటిమల వల్ల కలిగే దురద, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…