Godfather First Review : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తరువాత నటించిన చిత్రం.. గాడ్ ఫాదర్. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇందులో నయనతార, సునీల్, సత్యదేవ్, సముద్రఖని, మురళీ శర్మ వంటివారు కీలకపాత్రల్లో నటించారు. అయితే రీమేక్ సినిమా కావడంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చిత్రం ట్రైలర్తో అందరి అంచనాలను అందుకునేలా ఉందని కామెంట్లు వినిపించాయి.
ఇక గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించారు. ఈ క్రమంలోనే సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మళయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫర్కు రీమేక్గా తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మళయాళ సినిమాలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. అయితే తెలుగులో చాలా మంది వీక్షించారు. కనుక స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. అందువల్ల గాడ్ ఫాదర్ను ఆదరిస్తారా.. అనే ప్రశ్న వస్తోంది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాను తెరకెక్కించారు. కనుక తప్పక హిట్ అవుతుందని.. చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక గాడ్ ఫాదర్ చిత్రానికి గాను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు గాడ్ ఫాదర్ మూవీని చూశానని చెబుతూ రివ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. గాడ్ ఫాదర్ సినిమాను చూశా. సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన రివ్యూ ఇది. బి, సి క్లాస్ ప్రేక్షకులకు ఇది యావరేజ్గా అనిపిస్తుంది. కొత్త సీసాలో పాత సారా అన్నట్లు ఉంటుంది. చిరంజీవి, దయ చేసి మీరు రెస్ట్ తీసుకోండి. మంచి కథను ఎంచుకుని సినిమాలను తీయండి. ప్రజల మనిషి, మాస్ హీరో వంటి క్యారెక్టర్లతో సినిమాలు చేయండి. చెత్త కథలతో ప్రయోగాలు చేయకండి.. అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…