Godfather Press Meet : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం.. గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. మళయాళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో నయనతార, సునీల్, సత్యదేవ్ తదితర నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. కాగా గాడ్ ఫాదర్ రిలీజ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్లో పాల్గొన్న చిరంజీవి పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పారు. గాడ్ ఫాదర్లో ఉన్న డైలాగ్స్ నిజ జీవితంలో ఉన్న రాజకీయ పార్టీలను ఉద్దేశించి రాసినవా.. అని అడగ్గా.. అలా ఏమీ కాదని చిరంజీవి తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో పవర్ఫుల్ డైలాగ్స్ను రాయడం జరిగిందన్నారు. ఇక తమ్ముడు పవన్ నడిపిస్తున్న జనసేన గురించి కూడా చిరుకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
తమ్ముడు పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న జనసేన పార్టీలో చేరుతా.. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.. ఇది నిజమేనా.. అని అడగ్గా.. అందుకు చిరు స్పందిస్తూ.. అలా ఏమీ లేదన్నారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చానని తెలిపారు. తాను బయటికి రావడం వల్ల తమ్ముడు పవన్కు ఇంకా మద్దతు పెరుగుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే తన సపోర్ట్ పవన్కు ఎప్పుడూ ఉంటుందన్నారు. పవన్ తన తమ్ముడని.. కనుక తన మద్దతు ఉంటుందని చిరు తెలిపారు. ప్రజలు మెచ్చే నాయకుడిగా పవన్ ఎదిగితే తాను జనసేనలో చేరవచ్చేమో.. అని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి చిరు.. జనసేన, పవన్ పై చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…