Rajamouli : ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ టీజర్ను ఆదివారం అయోధ్యలో విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ టీజర్ కొందరిని ఆకట్టుకుంటే మరికొందరిని నిరుత్సాహ పరచింది. అభిమానుల్లో కొందరు రోమాలు నిక్కబోడుచుకున్నాయని అంటుంటే.. మరి కొందరు కార్టూన్లతో సినిమా చేశారేంటి ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ నెటిజన్లు, అభిమానులే ఈ టీజర్ మీద కామెంట్ చేశారు. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఆదిపురుష్ టీజర్ను కామెంట్ చేసే జాబితాలో చేరారు.
ప్రభాస్ లాంటి తోపు హీరోతో ఇలాంటి సినిమా తీయడం ఏంటి అంటున్నారు. అదే నేనైతే ప్రభాస్ ని రాముడి పాత్రలో అద్భుతంగా చూపించేవాడిని అంటూ రాజమౌళి కామెంట్స్ చేశారు. అసలు ప్రభాస్ లాంటి తోపు హీరోని పెట్టుకుని కూడా ఇలాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో చూపించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రజంట్ ఈ కామెంట్స్ పరోక్షంగా ఓం రౌత్ పై ఎఫెక్ట్ చూపించనున్నాయట. టీజర్ విడుదలైన 2 గంటల తర్వాత రాజమౌళి సోదరుడు నటుడు, రచయిత ఎస్.ఎస్.కాంచీ ఈ విషయం మీద ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి అంటూ కామెంట్ చేశారు. అయితే కాంచీ ఎక్కడా పేరును ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆయన ట్వీట్ హాట్టాపిక్గా మారింది. అయితే ఇప్పుడాయన ట్వీట్ పై పలువురు భిన్నంగా స్పందించారు. అయితే కొంతమంది నెటిజన్లు ప్రభాస్ ను రాముడిగా చూపించాలంటే అది రాజమౌళికే సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్ ను వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ చేయనున్నారు. మరి టీజర్ విషయంలోనే ఈ రేంజ్ లో కామెంట్స్ వస్తే.. నెక్ట్స్ ట్రైలర్ రిలీజ్ అయితే కామెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అనే టాక్ కూడా వినిపిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…