Bigg Boss : అన్ని ప్రాంతీయ భాషలలోనూ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకొని త్వరలో ఆరో సీజన్ జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇది కాకుండా ఓటీటీలో తెలుగు బిగ్బాస్ షో రాబోతుందని దానికి బాలకృష్ణ హోస్టింగ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. ఇప్పటివరకూ చూసిన బిగ్బాస్ షోకి.. ఓటీటీలో చూడబోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ విభిన్నమైన ఫార్మాట్లు అని అన్నారు.
బిగ్బాస్ ఓటీటీ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నాం. షో ఎలా ఉండాలి ? ఎంతమంది కంటెస్టెంట్స్ ? ఎన్ని రోజులు ? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తాం అని తెలిపారు నాగ్. ఈ షోకి వ్యాఖ్యాతగా అడుగుపెట్టే సమయంలో ఏదో తెలియని భయం.. కానీ అడుగుపెట్టాక.. నేను కూడా ఈ షోకి అభిమానిగా మారిపోయాను. సీజన్-3, 4 పూర్తయ్యాక కంటెస్టెంట్స్ చాలామంది మా ఇంటికి వచ్చి.. షో మాకెంతో నేర్పించింది. మేము లైఫ్లో ఎంతో సక్సెస్ అయ్యాం అని చెబుతుంటే నేనెంతో ఆనందించాను.
డిస్నీ హాట్స్టార్ యాజమాన్యం నావద్దకు వచ్చి.. ‘బిగ్బాస్ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం అని చెప్పడంతో షాక్ అయ్యాను. చివరికి వాళ్లు ఒప్పించారు. బిగ్బాస్కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్బాస్ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్బాస్ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్హిట్. త్వరలోనే ఓటీటీ ప్రారంభం కానుందని నాగార్జున అన్నారు.
అయితే బిగ్బాస్ తదుపరి సీజన్కు బాలకృష్ణ హోస్ట్గా వస్తారని ప్రచారం జరుగుతుంది కదా.. దానిపై మీ స్పందన ఏమిటి ? అని ప్రశ్నించగా.. అందుకు నాగ్ బదులిస్తూ.. బిగ్బాస్కు తానే హోస్ట్గా ఉంటానని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…