Bigg Boss : అన్ని ప్రాంతీయ భాషలలోనూ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకొని త్వరలో ఆరో సీజన్ జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇది కాకుండా ఓటీటీలో తెలుగు బిగ్బాస్ షో రాబోతుందని దానికి బాలకృష్ణ హోస్టింగ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. ఇప్పటివరకూ చూసిన బిగ్బాస్ షోకి.. ఓటీటీలో చూడబోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ విభిన్నమైన ఫార్మాట్లు అని అన్నారు.
బిగ్బాస్ ఓటీటీ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నాం. షో ఎలా ఉండాలి ? ఎంతమంది కంటెస్టెంట్స్ ? ఎన్ని రోజులు ? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తాం అని తెలిపారు నాగ్. ఈ షోకి వ్యాఖ్యాతగా అడుగుపెట్టే సమయంలో ఏదో తెలియని భయం.. కానీ అడుగుపెట్టాక.. నేను కూడా ఈ షోకి అభిమానిగా మారిపోయాను. సీజన్-3, 4 పూర్తయ్యాక కంటెస్టెంట్స్ చాలామంది మా ఇంటికి వచ్చి.. షో మాకెంతో నేర్పించింది. మేము లైఫ్లో ఎంతో సక్సెస్ అయ్యాం అని చెబుతుంటే నేనెంతో ఆనందించాను.
డిస్నీ హాట్స్టార్ యాజమాన్యం నావద్దకు వచ్చి.. ‘బిగ్బాస్ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం అని చెప్పడంతో షాక్ అయ్యాను. చివరికి వాళ్లు ఒప్పించారు. బిగ్బాస్కి పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్బాస్ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్బాస్ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్హిట్. త్వరలోనే ఓటీటీ ప్రారంభం కానుందని నాగార్జున అన్నారు.
అయితే బిగ్బాస్ తదుపరి సీజన్కు బాలకృష్ణ హోస్ట్గా వస్తారని ప్రచారం జరుగుతుంది కదా.. దానిపై మీ స్పందన ఏమిటి ? అని ప్రశ్నించగా.. అందుకు నాగ్ బదులిస్తూ.. బిగ్బాస్కు తానే హోస్ట్గా ఉంటానని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…