Bigg Boss 5 : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలుగా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. పూనే, సతారా, పాల్టన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్లను ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు. రామ్ చరణ్ కెరీర్లో 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ భారీ రేంజ్లో ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు.
ఈ సినిమా కోసం భారీ ఫైట్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారని, అయితే అందులో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. 7 నిమిషాల పాటు సాగే ఈ ఒక్క ఫైట్ కోసం దాదాపుగా రూ.70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఏ సినిమాలోనూ చూడని రేంజ్లో ఈ ఫైట్ సీన్ ఉంటుందని తెలుస్తుండడం మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది.
ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు ప్రేక్షకులని ఎంతగానో ఆనందింపజేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త అభిమానులని ఆనందింపజేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో పాల్గొని ఫుల్ ఎంటర్టైన్ చేసిన లోబో, విశ్వ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ ఇద్దరూ రామ్ చరణ్తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ కు ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. మిగతా భాషల్లోనూ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా.. లేకుంటే వేరే ఏదైనా టైటిల్ పెడతారా.. అనేది చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…