Bigg Boss 5 : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలుగా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. పూనే, సతారా, పాల్టన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్లను ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు. రామ్ చరణ్ కెరీర్లో 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ భారీ రేంజ్లో ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు.
ఈ సినిమా కోసం భారీ ఫైట్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారని, అయితే అందులో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. 7 నిమిషాల పాటు సాగే ఈ ఒక్క ఫైట్ కోసం దాదాపుగా రూ.70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఏ సినిమాలోనూ చూడని రేంజ్లో ఈ ఫైట్ సీన్ ఉంటుందని తెలుస్తుండడం మెగా అభిమానులను హుషారెత్తిస్తోంది.
ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు ప్రేక్షకులని ఎంతగానో ఆనందింపజేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త అభిమానులని ఆనందింపజేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో పాల్గొని ఫుల్ ఎంటర్టైన్ చేసిన లోబో, విశ్వ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ ఇద్దరూ రామ్ చరణ్తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ కు ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. మిగతా భాషల్లోనూ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా.. లేకుంటే వేరే ఏదైనా టైటిల్ పెడతారా.. అనేది చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…