Balakrishna : యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన దగ్గర నుండి నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఖండించింది. అయితే కుప్పంలో తారక రత్న కుప్పకూలిన సమయం నుంచి బెంగళూరు వెళ్ళే వరకు… ఇప్పుడు ఈ క్షణం వరకు కన్న కుమారుడి కంటే ఎక్కువగా, కంటికి రెప్పలా నందమూరి బాలకృష్ణ చూసుకుంటున్నారు.
వైద్యులతో నిరంతరం మాట్లాడుతూ చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అలానే అటు కుటుంబ సభ్యులకు, ఇటు మీడియాకు అప్ టు డేట్… అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే బాలయ్య .. తారకరత్న చెవిలో మృత్యుంజయ హోమం చదివాడని అందుకే ఆ గుండె కొట్టుకుంటుందని నిర్మాత ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చాడు. మీడియాతో మాట్లాడారు తుమ్మల ప్రసన్నకుమార్… తారకరత్న కోలుకుంటున్నారు…కాళ్ళు , చేతులు కదుపుతున్నారన్నారు. ఆపస్మాకర స్దితిలో ఉండి బాలకృష్ణ మాట వినిన వెంటనే చలించారు.
కుప్పంలో తారకరత్న గుండె దాదాపు 45 నిమిషాలు గుండె ఆగిందని తెలిపారు. బాలకృష్ణ వెళ్ళి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడు…మృత్యంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రసన్నకుమార్. తారకరత్న వంద శాతం సేఫ్ గా ఉన్నాడు..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని తెలిపారు. రోజు రోజుకీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, వైద్య చికిత్సకు ఆయన స్పందించడంతో పాటు కోలుకుంటున్నారని తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్ళి తారక రత్నను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ గానీ, నందమూరి కళ్యాణ్ రామ్ గానీ, ఇతర కుటుంబ సభ్యులు గానీ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…