Balakrishna And Nagarjuna : వెండితెరపై ఎన్ని రకాలు చిత్రాలు వచ్చిన కూడా మల్టీస్టారర్ చిత్రాలని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎందుకంటే ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసినట్లు ఇద్దరు స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటానికి అభిమానులు బాగా ఆసక్తి చూపుతారు. ఇలా అభిమానులు ఇష్టపడే మల్టీస్టారర్ చిత్రాలు టాలీవుడ్ లో ఎన్నో వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలోనే టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా అప్పటిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తున్నారు అంటే చాలు అభిమానులు పండగ చేసుకునేవారు.
ఆ తర్వాత కాలంలో నందమూరివారి నటవారసుడిగా బాలకృష్ణ, ఏఎన్ఆర్ నటవారసుడిగా నాగార్జున హీరోలగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో బాలకృష్ణ మరియు నాగార్జున కాంబినేషన్ లోనూ మల్టీస్టారర్ రావాలని అభిమానులు కోరుకున్నారు. ఇక ఏఎన్నార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన గుండమ్మ కథ సినిమాను మరోసారి కథలో మార్పులు చేసి బాలకృష్ణ, నాగార్జునలతో తెరకెక్కించాలని అప్పటిలో ప్రయత్నాలు జరిగాయి. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
ఆ తర్వాత మరో ప్రయత్నంగా మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను బాలకృష్ణ, నాగార్జునలతో రీమేక్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయట. ఈ సినిమా కోసం నిర్మాత సురేష్ బాబు వీరిద్దరిని ఒప్పించడం కూడా జరిగిందట. ఈ సినిమాకు బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవడంతో నాగార్జున, బాలయ్యల మధ్య సఖ్యత లేదనే వార్తలు వినిపించాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రావలసిన మరో సినిమా కూడా ఆగిపోయింది. ఇక 1999లో ఎన్టీఆర్ మరో వారసుడు హరికృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో సీతారామరాజు సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పటిలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో నందమూరి మరియు అక్కినేని అభిమానుల కల నెరవేరింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…