Balakrishna And Nagarjuna : వెండితెరపై ఎన్ని రకాలు చిత్రాలు వచ్చిన కూడా మల్టీస్టారర్ చిత్రాలని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎందుకంటే ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసినట్లు ఇద్దరు స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటానికి అభిమానులు బాగా ఆసక్తి చూపుతారు. ఇలా అభిమానులు ఇష్టపడే మల్టీస్టారర్ చిత్రాలు టాలీవుడ్ లో ఎన్నో వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలోనే టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా అప్పటిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తున్నారు అంటే చాలు అభిమానులు పండగ చేసుకునేవారు.
ఆ తర్వాత కాలంలో నందమూరివారి నటవారసుడిగా బాలకృష్ణ, ఏఎన్ఆర్ నటవారసుడిగా నాగార్జున హీరోలగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో బాలకృష్ణ మరియు నాగార్జున కాంబినేషన్ లోనూ మల్టీస్టారర్ రావాలని అభిమానులు కోరుకున్నారు. ఇక ఏఎన్నార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన గుండమ్మ కథ సినిమాను మరోసారి కథలో మార్పులు చేసి బాలకృష్ణ, నాగార్జునలతో తెరకెక్కించాలని అప్పటిలో ప్రయత్నాలు జరిగాయి. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
ఆ తర్వాత మరో ప్రయత్నంగా మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను బాలకృష్ణ, నాగార్జునలతో రీమేక్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయట. ఈ సినిమా కోసం నిర్మాత సురేష్ బాబు వీరిద్దరిని ఒప్పించడం కూడా జరిగిందట. ఈ సినిమాకు బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవడంతో నాగార్జున, బాలయ్యల మధ్య సఖ్యత లేదనే వార్తలు వినిపించాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రావలసిన మరో సినిమా కూడా ఆగిపోయింది. ఇక 1999లో ఎన్టీఆర్ మరో వారసుడు హరికృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో సీతారామరాజు సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పటిలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో నందమూరి మరియు అక్కినేని అభిమానుల కల నెరవేరింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…