Anil Kumar Yadav : ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం టీవీ సీరియల్ని తలపిస్తోంది. తరువాయి భాగం రేపు అన్నట్టుగా… రోజుకో మలుపు తిరుగుతోంది. సినీ ప్రముఖులు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దానిపై మంత్రులు ఘాటుగా స్పందించడం కొద్ది రోజులుగా నడుస్తూ వస్తోంది. రీసెంట్గా నాని టిక్కెట్లు రేట్లు తగ్గించడం ప్రేక్షకులని అవమానపరచడమే అని అన్నాడు. నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబుతోపాటు పలువురు నేతలు నాని కామెంట్స్ ను తప్పుబట్టారు. తాజాగా హీరో నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అనిల్కుమార్ యాదవ్. నాని భజనపరుడని విమర్శించారు. సినిమా ఖర్చులో 80 శాతం రెమ్యునరేషన్కు వెళ్తుంటే, అసలు ఖర్చు 20 శాతమేనన్నారు. ఆ 80 శాతాన్ని ప్రేక్షకులపై రుద్దడం ఏంటని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చిన అనిల్ కుమార్ యాదవ్.. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కి పెట్టిన ఖర్చెంతో చెప్పాలన్నారు. ప్రజలని ఉద్ధరిస్తానన్న పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా.. అంటూ సెటైర్లు సంధించారు. తనకున్న క్రేజ్ను పవన్ అమ్ముకొంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు నేను కూడా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ కి కటౌట్ లు కట్టానంటూ చెప్పుకొచ్చారు. ప్రొడక్షన్ కాస్ట్ 30 శాతం అయితే రెమ్యునరేషన్ 70 శాతం ఉంది అని ఆయన మండిపడ్డారు. మరి దీనిపై పవన్ ఏమైనా స్పందిస్తారా.. అనేది చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…