తిరుప‌తి ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజ‌యం..

April 29, 2021 8:23 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే అత్య‌ధిక స్థానాల‌ను ప్ర‌జ‌లు వైకాపాకు క‌ట్ట‌బెట్టారు. దీంతో జ‌గ‌న్ సీఎం అయ్యారు. అంతేకాదు, ఆయన పాద‌యాత్ర‌లో, ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాల‌ను కూడా పూర్తి చేస్తున్నారు. దీంతో ఏ ఎన్నిక‌ల్లో అయినా స‌రే వైకాపా విజ‌య దుందుభి మోగిస్తూనే వ‌స్తోంది. ఇక ఇటీవ‌ల తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జరిగిన విష‌యం విదిత‌మే. కాగా ఆ ఎన్నిక‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలో వైసీపీ త‌న సీటును మ‌ళ్లీ సొంతం చేసుకుంటుంద‌ని అన్ని ఎగ్జిట్స్ పోల్స్ తేల్చి చెప్పాయి.

tirupathi by election exit polls ysrcp will win

తిరుప‌తి లోక్‌స‌భ సిట్టింగ్ స్థానాన్ని వైకాపా మ‌ళ్లీ సొంతం చేసుకుంటుంద‌ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ క్ర‌మంలోనే ఆరా ఎగ్జిట్ పోల్స్‌లో వైకాపాకు 65.85 శాతం, టీడీపీకి 23.10 శాతం, బీజేపీకి 7.34 శాతం ఓట్లు వ‌స్తాయని తెలిపారు. అయితే తుది ఫ‌లితాల‌కు 2 నుంచి 3 శాతం వ‌ర‌కు తేడా ఉండేందుకు అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు.

ఇక ఆత్మ సాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం కూడా వైకాపాకే సీటు వ‌స్తుంద‌ని వెల్ల‌డైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం వైకాపాకు 59.25 శాతం, టీడీపీకి 31.25 శాతం, బీజేపీకి 7.5 శాతం వ‌ర‌కు ఓట్లు రావ‌చ్చ‌ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. ఈ క్ర‌మంలో ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి తిరుప‌తి ఎంపీగా విజ‌యం సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఉప ఎన్నిక ఫ‌లితాలు మే 2వ తేదీన వెలువ‌డుతాయి క‌నుక అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment