కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీకి చెందిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఏపీలో ఎన్400కె అనే కొత్త వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది. విశాఖపట్నంతోపాటు ఆ రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఈ వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలియజేసింది. అందువల్లే ఏపీలో కోవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
కాగా ఈ కోవిడ్ స్ట్రెయిన్ ముందుగా కర్నూల్లో గుర్తించబడిందని, పాత వేరియెంట్ల కన్నా కొత్త స్ట్రెయిన్ 15 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు తెలిపారు. ఇండియన్ వేరియెంట్లయిన బి1.617, బి1.618ల కన్నా ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్కు చెందిన శాంపిల్స్ను సేకరించాం, సీసీఎంబీకు పరిశీలన నిమిత్తం పంపించాం. అయితే కోవిడ్ మొదటి వేవ్ కన్నా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వేరియెంట్ భిన్నంగా ఉందని తెలిసింది.. అన్నారు.
జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ పీవీ సుధాకర్ మాట్లాడుతూ.. కొత్త కోవిడ్ వేరియెంట్ ఇంకుబేషన్ సమయం చాలా తక్కువగా ఉందని, వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. గతంలో కోవిడ్ బారిన పడినప్పుడు శ్వాస అందని స్థితి వచ్చేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టేదని, కానీ ఇప్పుడు కొత్త వేరియెంట్ వల్ల ఆ స్థితి కేవలం 3-4 రోజుల్లోనే వస్తుందన్నారు. అందువల్ల బెడ్లు, ఆక్సిజన్కు కొరత ఏర్పడిందన్నారు.
ఇక కొత్త కోవిడ్ వేరియెంట్కు తక్కువ సమయం పాటు ఎక్స్పోజ్ అయినప్పటికీ ఏకంగా 4-5 మందికి వైరస్ సోకుతుందన్నారు. ఈ క్రమంలోనే కొత్త వేరియెంట్ను అసలు అంచనా వేయలేకపోతున్నామని అన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…