కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీకి చెందిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఏపీలో ఎన్400కె అనే కొత్త వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది. విశాఖపట్నంతోపాటు ఆ రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఈ వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలియజేసింది. అందువల్లే ఏపీలో కోవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
కాగా ఈ కోవిడ్ స్ట్రెయిన్ ముందుగా కర్నూల్లో గుర్తించబడిందని, పాత వేరియెంట్ల కన్నా కొత్త స్ట్రెయిన్ 15 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు తెలిపారు. ఇండియన్ వేరియెంట్లయిన బి1.617, బి1.618ల కన్నా ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్కు చెందిన శాంపిల్స్ను సేకరించాం, సీసీఎంబీకు పరిశీలన నిమిత్తం పంపించాం. అయితే కోవిడ్ మొదటి వేవ్ కన్నా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వేరియెంట్ భిన్నంగా ఉందని తెలిసింది.. అన్నారు.
జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ పీవీ సుధాకర్ మాట్లాడుతూ.. కొత్త కోవిడ్ వేరియెంట్ ఇంకుబేషన్ సమయం చాలా తక్కువగా ఉందని, వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. గతంలో కోవిడ్ బారిన పడినప్పుడు శ్వాస అందని స్థితి వచ్చేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టేదని, కానీ ఇప్పుడు కొత్త వేరియెంట్ వల్ల ఆ స్థితి కేవలం 3-4 రోజుల్లోనే వస్తుందన్నారు. అందువల్ల బెడ్లు, ఆక్సిజన్కు కొరత ఏర్పడిందన్నారు.
ఇక కొత్త కోవిడ్ వేరియెంట్కు తక్కువ సమయం పాటు ఎక్స్పోజ్ అయినప్పటికీ ఏకంగా 4-5 మందికి వైరస్ సోకుతుందన్నారు. ఈ క్రమంలోనే కొత్త వేరియెంట్ను అసలు అంచనా వేయలేకపోతున్నామని అన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందన్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…