Mutton : ప్రస్తుతం చికెన్ రేటు ఏమోగానీ మటన్ రేటు అయితే కొండెక్కి కూర్చుంది. మటన్ తిందామంటేనే గుండె గుభేల్ మనేట్లు రేట్లు ఉన్నాయి. కేజీకి దాదాపుగా రూ.700 నుంచి కొన్ని చోట్ల రూ.800 వరకు మటన్ ధర పలుకుతోంది. ఇక గొర్రె పొట్టేలు అయితే రూ.500 వరకు ధర ఉంటోంది. కానీ అక్కడ మాత్రం దాన్ని కేవలం రూ.50కే విక్రయించారు. అవును.. ఇది నిజమే..
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు వాల్మీకిపురంలో మాంసం విక్రయదారులు పోటీలు పడి మరీ మటన్ను అమ్మారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మటన్ ధర అమాంత పడిపోయింది. కిలో పొట్టేలు లేదా మేక మాంసం ఏది కొన్నా సరే కేవలం రూ.50కే ఇచ్చారు. దీంతో ప్రజలు పోటీలు పడి మరీ ఒక్కొక్కరు 5 నుంచి 10 కిలోల వరకు మటన్ కొనేశారు.
స్థానికంగా ఉన్న గాంధీ బస్ స్టాండ్ వద్ద ఓ దుకాణదారుడు ముందుగా రూ.300కు కిలో మటన్ అని బోర్డు పెట్టాడు. దీంతో ప్రజలు ఎగబడి కొన్నారు. అయితే అతన్ని చూసిన ఇతర షాపుల వారు సైతం పోటీలు పడి మరీ మటన్ ధరలను ఒకేసారి తగ్గిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ధర రూ.300 నుంచి రూ.200, రూ.100కు పడిపోయింది. తరువాత ఒక దశలో ఒక దుకాణదారుడు కేవలం రూ.50 కే కిలో మటన్ ఇస్తానని చెప్పడంతో ప్రజలంతా అటు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మటన్ను కొన్నారు. దీంతో రాత్రి 7.30 గంటల వరకు మాంసం మొత్తం అమ్ముడు పోయింది. దుకాణదారులు పోటీ పడి మరీ ధరలను తగ్గించడంతోనే ఈ విధంగా స్పందన లభించిందని అంటున్నారు.
అయితే అక్కడ నిజానికి ఇతర ప్రాంతాలతో పోలిస్తే గత వారం పది రోజుల నుంచి మటన్ ధరలు తక్కువే ఉన్నాయి. కిలో మటన్ను రూ.400కు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని మటన్ ధరతో పోలిస్తే ఇది తక్కువే కావడం విశేషం. కానీ చికెన్ మాత్రం కేజీకి రూ.160 చొప్పున యథావిధిగా అమ్ముడైంది. ధర తగ్గలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…