ఆంధ్ర‌ప్ర‌దేశ్

2 ఏళ్ల కింద‌ట ఇద్ద‌రు కుమార్తెలు దుర‌దృష్ట‌వ‌శాత్తూ చ‌నిపోయారు.. ఇప్పుడు ఆ దంప‌తుల‌కే మ‌ళ్లీ క‌వ‌ల‌ల రూపంలో జ‌న్మించారు..!

కొంద‌రి జీవితాల్లో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అవి యాదృచ్ఛికంగానే జ‌రిగినా స‌రే కొన్ని సంద‌ర్భాల్లో అలాంటి సంఘ‌ట‌న‌లు గురించి చ‌దువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయా ? అని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతుంటారు. విశాఖ‌ప‌ట్నంలోనూ స‌రిగ్గా అలాంటి ఆశ్చ‌ర్య‌పోయే, అబ్బుర‌ప‌రిచే సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

విశాఖ‌ప‌ట్నంలో నివాసం ఉంటున్న అప్ప‌ల రాజు, భాగ్య‌ల‌క్ష్మి దంప‌తులు స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ త‌యారీ సంస్థ‌లో ప‌నిచేస్తున్నారు. అయితే 2 ఏళ్ల కింద‌ట వారికి ఇద్ద‌రు కుమార్తెలు ఉండేవారు. ఒక కుమార్తెకు అప్పుడు ఏడాది వ‌య‌స్సు ఉండ‌గా, ఇంకో కుమార్తెకు 3 ఏళ్ల వ‌య‌స్సు ఉండేది. అయితే వారిద్ద‌రినీ తీసుకుని వారి బామ్మ భ‌ద్రాచ‌లం ఆల‌యానికి బోటులో గోదావ‌రి న‌దిపై బ‌యల్దేరింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ బోటు మునిగి అందులో ప్ర‌యాణిస్తున్న 50 మంది ప్ర‌యాణికులు చ‌నిపోయారు.

ఆ దంప‌తుల‌కు చెందిన ఇద్ద‌రు కుమార్తెలు, వారి బామ్మ కూడా ఆ ప్ర‌మాదంలో చ‌నిపోయారు. ఈ సంఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 15, 2019న చోటు చేసుకుంది. అయితే స‌రిగ్గా 2 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ అదే తేదీ రోజున తాజాగా అప్ప‌ల రాజు, భాగ్య‌ల‌క్ష్మి దంప‌తుల‌కు క‌వ‌ల పిల్ల‌లు జ‌న్మించారు. ఇద్ద‌రూ ఆడ పిల్ల‌లే. ఆ రోజున ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారే మ‌ళ్లీ ఇప్పుడు క‌వ‌ల పిల్ల‌ల రూపంలో త‌మ‌కు పుట్టార‌ని ఆ దంప‌తులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘ‌ట‌న యాదృచ్ఛికంగానే జ‌రిగిన‌ప్ప‌టికీ ఎంతో అద్భుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. నిజంగా అదృష్టం అంటే ఆ దంప‌తుల‌దే అని చెప్ప‌వ‌చ్చు. చ‌నిపోయార‌నుకున్న కుమార్తెలు మ‌ళ్లీ ఇలా క‌వ‌ల‌ల రూపంలో జ‌న్మించార‌ని వారు ప‌డుతున్న సంతోషం అంతా ఇంతా కాదు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM