కొందరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి యాదృచ్ఛికంగానే జరిగినా సరే కొన్ని సందర్భాల్లో అలాంటి సంఘటనలు గురించి చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతాయా ? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. విశాఖపట్నంలోనూ సరిగ్గా అలాంటి ఆశ్చర్యపోయే, అబ్బురపరిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులు స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ తయారీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే 2 ఏళ్ల కిందట వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. ఒక కుమార్తెకు అప్పుడు ఏడాది వయస్సు ఉండగా, ఇంకో కుమార్తెకు 3 ఏళ్ల వయస్సు ఉండేది. అయితే వారిద్దరినీ తీసుకుని వారి బామ్మ భద్రాచలం ఆలయానికి బోటులో గోదావరి నదిపై బయల్దేరింది. కానీ దురదృష్టవశాత్తూ బోటు మునిగి అందులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులు చనిపోయారు.
ఆ దంపతులకు చెందిన ఇద్దరు కుమార్తెలు, వారి బామ్మ కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటన సెప్టెంబర్ 15, 2019న చోటు చేసుకుంది. అయితే సరిగ్గా 2 ఏళ్ల తరువాత మళ్లీ అదే తేదీ రోజున తాజాగా అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ ఆడ పిల్లలే. ఆ రోజున ప్రమాదంలో చనిపోయిన వారే మళ్లీ ఇప్పుడు కవల పిల్లల రూపంలో తమకు పుట్టారని ఆ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ ఎంతో అద్భుతమనే చెప్పవచ్చు. నిజంగా అదృష్టం అంటే ఆ దంపతులదే అని చెప్పవచ్చు. చనిపోయారనుకున్న కుమార్తెలు మళ్లీ ఇలా కవలల రూపంలో జన్మించారని వారు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…