కొందరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి యాదృచ్ఛికంగానే జరిగినా సరే కొన్ని సందర్భాల్లో అలాంటి సంఘటనలు గురించి చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతాయా ? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. విశాఖపట్నంలోనూ సరిగ్గా అలాంటి ఆశ్చర్యపోయే, అబ్బురపరిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులు స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ తయారీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే 2 ఏళ్ల కిందట వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. ఒక కుమార్తెకు అప్పుడు ఏడాది వయస్సు ఉండగా, ఇంకో కుమార్తెకు 3 ఏళ్ల వయస్సు ఉండేది. అయితే వారిద్దరినీ తీసుకుని వారి బామ్మ భద్రాచలం ఆలయానికి బోటులో గోదావరి నదిపై బయల్దేరింది. కానీ దురదృష్టవశాత్తూ బోటు మునిగి అందులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికులు చనిపోయారు.
ఆ దంపతులకు చెందిన ఇద్దరు కుమార్తెలు, వారి బామ్మ కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటన సెప్టెంబర్ 15, 2019న చోటు చేసుకుంది. అయితే సరిగ్గా 2 ఏళ్ల తరువాత మళ్లీ అదే తేదీ రోజున తాజాగా అప్పల రాజు, భాగ్యలక్ష్మి దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ ఆడ పిల్లలే. ఆ రోజున ప్రమాదంలో చనిపోయిన వారే మళ్లీ ఇప్పుడు కవల పిల్లల రూపంలో తమకు పుట్టారని ఆ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ ఎంతో అద్భుతమనే చెప్పవచ్చు. నిజంగా అదృష్టం అంటే ఆ దంపతులదే అని చెప్పవచ్చు. చనిపోయారనుకున్న కుమార్తెలు మళ్లీ ఇలా కవలల రూపంలో జన్మించారని వారు పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు..!
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…