పెళ్లి చేసుకున్నా అతను భార్యను రూ.లక్షలు ఖర్చు పెట్టి చదివించాడు. వీసా, పాస్పోర్టు వంటి పనులకు కూడా ఎంతో మొత్తం ఖర్చు చేశాడు. చివరకు అతను తన భార్యను విదేశాలకు పంపాడు. కానీ ఆమె మాత్రం తన సోదరులతో కలిసి భర్తను మోసం చేసింది. వివరాల్లోకి వెళితే..
చండీగఢ్కు చెందిన మన్వీర్ సింగ్ మండ్, అదే ప్రాంతానికి చెందిన గుర్కమల్ కౌర్లకు 2019లో వివాహం జరిగింది. గుర్ కమల్ కౌర్కు పరంజిత్ సింగ్, పుష్పీందర్ సింగ్ అనే ఇద్దరు సోదరులు, సురీందర్ కౌన్ అనే సోదరి ఉన్నారు. అయితే పెళ్లయ్యాక మన్వీర్ సింగ్ తన భార్యను బాగా చదివించాడు. విదేశాలకు ఆమెను ఉద్యోగం కోసం పంపి కొంతకాలం గడిచాక తాను కూడా అక్కడికి వెళ్లి స్థిర పడవచ్చని అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అతన్ని మోసం చేసింది.
గుర్ కమల్ కౌర్ చదువుతోపాటు వీసా, పాస్పోర్టు, విమాన టిక్కెట్లు, ఇతర పనులకు మన్వీర్ సింగ్ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. చివరకు ఆమెను విదేశాలకు కూడా పంపాడు. కానీ ఆమె అక్కడికి వెళ్లగానే మన్వీర్ సింగ్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మన్వీర్ సింగ్ ఆమెతోపాటు ఆమె సోదరులపై కేసు పెట్టాడు.
అయితే ఆమె సోదరులు మన్వీర్తో రాజీ యత్నం చేశారు. రూ.15 లక్షలు ఇస్తామని మన్ వీర్ను ఒప్పించారు. కానీ వారు రూ.7 లక్షలు మాత్రమే ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని మన్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…