IPL 2021 : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత కామ్గా, కూల్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మైదానంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నా ధోనీ ఏమాత్రం ప్రభావితం కాడు. తన ఆట తాను కొనసాగిస్తాడు. అందుకనే ధోనీకి మిస్టర్ కూల్ అని పేరు వచ్చింది. అయితే ఎంతైనా ధోనీ కూడా మనిషే కదా. కనుక అతనికి కూడా ఎప్పుడో ఒకసారి ఆగ్రహం వస్తుంటుంది. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ముంబై ఇండియన్స్ ప్లేయర్ సౌరభ్ తివారీ తమ జట్టును గెలిపించేందుకు జోరు మీదున్నాడు. అయితే అదే సమయంలో చెన్నై బౌలర్ దీపక్ చాహర్ వేసిన బంతి తివారీ బ్యాట్ ఎడ్జ్కు తాకి గాల్లోకి పైకి లేచింది. ధోనీ క్యాచ్ తాను పడతానంటూ అరుస్తూ క్యాచ్ పట్టేందుకు ముందుకు వెళ్లాడు. కానీ క్యాచ్ వచ్చే పొజిషన్లో అప్పటికే బ్రేవో క్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు చేతులు చాపాడు. అయితే ధోనీ దాన్ని గమనించకుండా క్యాచ్ కోసం ముందుకు వచ్చేశాడు. దీంతో బంతి ఇద్దరి మధ్యలో పడింది. ఎవరికీ క్యాచ్ లభించలేదు.
అయితే ఈ క్యాచ్ వదిలేసినా మ్యాచ్పై అది పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే చివరకు ముంబైపై చెన్నై సునాయాసంగానే గెలుపొందింది. అయితే ఆ క్యాచ్ సందర్భంగా ధోనీ బ్రేవోపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…