హిందూపురంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు శుక్రవారం (ఫిబ్రవరి 20, 2026) తన సతీమణి వసుంధరతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గంలో ఇంటిని నిర్మిస్తుండడం ఆనందంగా ఉందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ ప్రస్తుతం తన మూడో పదవీకాలంలో ఉన్నారు. కాగా తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు 1985లో ఇదే హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని బాలకృష్ణ గుర్తు చేశారు. అదే నియోజకవర్గం నుంచి తనను ఎన్టీఆర్ వారసుడిగా ప్రజలు మూడుసార్లు ఆశీర్వదించారని తెలిపారు. హిందూపురంలోనే ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అభిమానులు, స్థానికులు తనను ప్రోత్సహించారని, అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇక నుంచి హిందూపురమే నా కొత్త కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆయన అన్నారు.
కాగా బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ చురుగ్గా నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ 2 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తరువాతి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే హిందూపూర్లో ఇల్లు నిర్మిస్తే ఇక ఆయన ఓవైపు అక్కడ ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉంటూనే మరో వైపు హైదరాబాద్ కు వచ్చి సినిమాల్లోనూ నటిస్తూ మరింత చురుగ్గా డ్యుయల్ రోల్ పోషిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.
హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని స్టార్ హీరో ప్రభాస్ అన్నారు. సంతోష్ శోభన్, మానసా వారణాసి, కపుల్…
ఇంధన రంగంలో స్థిరమైన, ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాన్ని ఆశించే వారికి శుభవార్త. ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్…
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న సమయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్…
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి భారత్లో రియల్మి పవర్ డేస్ సేల్ పేరిట ప్రత్యేక సేల్ను నిర్వహిస్తోంది.…
ఇటీవలి కాలంలో టాలీవుడ్లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ…
తాజా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల ఫామ్పై ప్రశ్నలు…
బాహుబలి రెండు సినిమాలు తన కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచినప్పటికీ ఆ తరువాత వచ్చిన అనేక భారీ ఆఫర్లను వదులుకోవాల్సి…
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ఈ పోస్ట్…