ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి పట్ల కొందరు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు వస్తే ఎక్కడ కోవిడ్ సోకి చనిపోతామేమోనని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం లేదు. సరిగ్గా ఆ నలుగురు కుటుంబ సభ్యులు కూడా ఇలాగే చేశారు. కానీ ఎట్టకేలకు పోలీసులు వచ్చి వారిని బయటకు తీసుకువచ్చి రక్షించారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లోని కడలి అనే గ్రామంలో గురునాథ్, రుత్తమ్మ, కాంతమణి, రాణి అనే నలుగురు కుటుంబ సభ్యులు గత 15 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కాగా ఓ గ్రామ వాలంటీర్ తాజాగా వారి ఇంటికి వచ్చి వారికి ప్రభుత్వ పథకం ప్రకారం ఇంటి ప్లాట్ అలాట్ అయిందని, వేలిముద్ర వేయాలని కోరాడు. అయినప్పటికీ వారు బయటకు రాలేదు. అలా వారు ఎవరు వచ్చి పిలిచినా బయటకు రాలేదు. అలాగే ఇంట్లోనే ఉన్నారు.
అయితే ఆ వాలంటీర్ పోలీసులకు సమాచారం అందింగా వారు వచ్చి ఆ కుటుంబ సభ్యులను బయటకు తీసుకువచ్చారు. వారు నలుగురూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఇంకొన్ని రోజులు వాళ్లు అలాగే ఉంటే చనిపోయేవారని పోలీసులు తెలిపారు. వారి ఇంటి పక్కన ఓ కుటుంబంలో ఓ వ్యక్తి అప్పట్లో కోవిడ్ వల్ల చనిపోయాడని, అందుకనే అప్పటి నుంచి వారు భయపడి ఇంటి నుంచి బయటకు రాలేదని పోలీసులు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…