ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి పట్ల కొందరు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు వస్తే ఎక్కడ కోవిడ్ సోకి చనిపోతామేమోనని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం లేదు. సరిగ్గా ఆ నలుగురు కుటుంబ సభ్యులు కూడా ఇలాగే చేశారు. కానీ ఎట్టకేలకు పోలీసులు వచ్చి వారిని బయటకు తీసుకువచ్చి రక్షించారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లోని కడలి అనే గ్రామంలో గురునాథ్, రుత్తమ్మ, కాంతమణి, రాణి అనే నలుగురు కుటుంబ సభ్యులు గత 15 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కాగా ఓ గ్రామ వాలంటీర్ తాజాగా వారి ఇంటికి వచ్చి వారికి ప్రభుత్వ పథకం ప్రకారం ఇంటి ప్లాట్ అలాట్ అయిందని, వేలిముద్ర వేయాలని కోరాడు. అయినప్పటికీ వారు బయటకు రాలేదు. అలా వారు ఎవరు వచ్చి పిలిచినా బయటకు రాలేదు. అలాగే ఇంట్లోనే ఉన్నారు.
అయితే ఆ వాలంటీర్ పోలీసులకు సమాచారం అందింగా వారు వచ్చి ఆ కుటుంబ సభ్యులను బయటకు తీసుకువచ్చారు. వారు నలుగురూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఇంకొన్ని రోజులు వాళ్లు అలాగే ఉంటే చనిపోయేవారని పోలీసులు తెలిపారు. వారి ఇంటి పక్కన ఓ కుటుంబంలో ఓ వ్యక్తి అప్పట్లో కోవిడ్ వల్ల చనిపోయాడని, అందుకనే అప్పటి నుంచి వారు భయపడి ఇంటి నుంచి బయటకు రాలేదని పోలీసులు తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…