బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. ఆ మాట కొస్తే పురుషులు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న రకాలుగా బంగారం ధరలు ఉంటాయి. కానీ అన్ని దేశాల కన్నా దుబాయ్లోనే బంగారం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే చాలా మంది అక్కడికి వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే అక్కడ బంగారం ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
దుబాయ్లో బంగారం విక్రయాన్ని అక్కడి ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించింది. అందులో భాగంగానే అక్కడ బంగారు బిస్కెట్లను, బార్లను కొంటే ఎలాంటి పన్నులు ఉండవు. ఇతర దేశాల నుంచి వచ్చే బంగారంపై దిగుమతి పన్ను ఉండదు. కేవలం ఆభరణాలపై 5 శాతం మాత్రం పన్నును వసూలు చేస్తారు. కానీ మన దేశంలో అలా కాదు, బంగారాన్ని ఎలా దిగుమతి చేసుకున్నా సరే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే మన దగ్గర బంగారం ఖరీదు ఎక్కువ.
దుబాయ్లో ఇన్కమ్ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని ఉండదు. బంగారం కొనుగోలు చేస్తే పన్నులు విధించరు. అక్కడ డిమాండ్ కన్నా సప్లై అధికం. అందువల్ల అక్కడ బంగారం తక్కువ ధరకు లభిస్తుంది. బంగారం విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించాలని ఆ ప్రభుత్వం ఎప్పటి నుంచో పన్నులను ఎక్కువగా వసూలు చేయడం లేదు. అందుకనే అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.
ఇక దుబాయ్ నుంచి వచ్చే పురుషులు తమ శరీరంపై 20 గ్రాముల వరకు బంగారం ధరించవచ్చు. దాని ఖరీదు రూ.50వేలను మించరాదు. అదే మహిళలు అయితే 40 గ్రాముల వరకు బంగారం ధరించవచ్చు. దాని ఖరీదు రూ.1 లక్ష మించరాదు. ఆ పరిమితి వరకు డ్యూటీ ఫ్రీ అలొవెన్స్ ఉంటుంది. పరిమితి దాటితే కస్టమ్స్ పన్ను వసూలు చేస్తారు. ఒక వ్యక్తి గరిష్టంగా 1 కిలో వరకు బంగారాన్ని దుబాయ్ నుంచి తేవచ్చు. లిమిట్ దాటితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దుబాయ్లో 6 నెలలు అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఉన్న వారు సాధారణ కస్టమ్స్ సుంకం చెల్లించి ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలను తేవచ్చు. కానీ 6 నెలల కన్నా తక్కువ కాలం పాటు ఉన్నవారు బంగారాన్ని తెస్తే ఏకంగా 36 శాతం వరకు దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…