బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. ఆ మాట కొస్తే పురుషులు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న రకాలుగా బంగారం ధరలు ఉంటాయి. కానీ అన్ని దేశాల కన్నా దుబాయ్లోనే బంగారం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే చాలా మంది అక్కడికి వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే అక్కడ బంగారం ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
దుబాయ్లో బంగారం విక్రయాన్ని అక్కడి ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించింది. అందులో భాగంగానే అక్కడ బంగారు బిస్కెట్లను, బార్లను కొంటే ఎలాంటి పన్నులు ఉండవు. ఇతర దేశాల నుంచి వచ్చే బంగారంపై దిగుమతి పన్ను ఉండదు. కేవలం ఆభరణాలపై 5 శాతం మాత్రం పన్నును వసూలు చేస్తారు. కానీ మన దేశంలో అలా కాదు, బంగారాన్ని ఎలా దిగుమతి చేసుకున్నా సరే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే మన దగ్గర బంగారం ఖరీదు ఎక్కువ.
దుబాయ్లో ఇన్కమ్ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని ఉండదు. బంగారం కొనుగోలు చేస్తే పన్నులు విధించరు. అక్కడ డిమాండ్ కన్నా సప్లై అధికం. అందువల్ల అక్కడ బంగారం తక్కువ ధరకు లభిస్తుంది. బంగారం విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించాలని ఆ ప్రభుత్వం ఎప్పటి నుంచో పన్నులను ఎక్కువగా వసూలు చేయడం లేదు. అందుకనే అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.
ఇక దుబాయ్ నుంచి వచ్చే పురుషులు తమ శరీరంపై 20 గ్రాముల వరకు బంగారం ధరించవచ్చు. దాని ఖరీదు రూ.50వేలను మించరాదు. అదే మహిళలు అయితే 40 గ్రాముల వరకు బంగారం ధరించవచ్చు. దాని ఖరీదు రూ.1 లక్ష మించరాదు. ఆ పరిమితి వరకు డ్యూటీ ఫ్రీ అలొవెన్స్ ఉంటుంది. పరిమితి దాటితే కస్టమ్స్ పన్ను వసూలు చేస్తారు. ఒక వ్యక్తి గరిష్టంగా 1 కిలో వరకు బంగారాన్ని దుబాయ్ నుంచి తేవచ్చు. లిమిట్ దాటితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దుబాయ్లో 6 నెలలు అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఉన్న వారు సాధారణ కస్టమ్స్ సుంకం చెల్లించి ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలను తేవచ్చు. కానీ 6 నెలల కన్నా తక్కువ కాలం పాటు ఉన్నవారు బంగారాన్ని తెస్తే ఏకంగా 36 శాతం వరకు దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…