Anasuya : బుల్లితెరకి గ్లామర్ అద్దిన హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది అనసూయ పేరు. అనసూయ భరద్వాజ్ ఓ అందాల యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్ను పెంచుకుంటూ పోతున్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ కనుల విందు చేస్తోంది. ఈ అమ్మడి రచ్చ సోషల్ మీడియాలో మాములుగా ఉండదు. గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది. అయితే యాంకర్ అనసూయను, తన డ్రెస్ లను ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం కొత్తేమీ కాదు. తాను కూడా ఆ కామెంట్స్, ఆ ట్రోల్స్ కి తగ్గట్టే రిప్లై ఇస్తుంటుంది.
అప్పుడప్పుడు తనపై వచ్చే ట్రోల్స్ కి గట్టిగానే సమాధానం చెబుతుంది అనసూయ. ఇటీవల అనసూయ పొట్టి దుస్తులలో ఫొటో షూట్ చేయగా.. అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా ? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు.. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే అనసూయ దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అనసూయ ఈ ట్వీట్ ని షేర్ చేస్తూ.. దయచేసి మీరు మీ పని చూసుకోండి, నన్ను నా పనిని చేసుకోవనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు.. అని పోస్ట్ చేసింది.
అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ చాలా పద్దతిగా కూడా కనిపిస్తుంటుంది. శ్రీ రామ నవమి సందర్భంగా అనసూయ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న అనసూయను చూసి తెగ కామెంట్లు పెడుతున్నారు. ఎంత పద్దతిగా ఉన్నారు.. అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు మీరు ఇప్పుడు చూడండి ఎంత పద్ధతిగా సంప్రదాయానికి చీర కట్టినట్టు ఉన్నారో.. ఇలా ఉంటే మీకు ఎప్పటికీ నెగెటివ్ కామెంట్స్ అసలు రావు. మీలాంటి సెలబ్రిటీలను చూసి ఇంకా చాలా మంది అమ్మాయిలు మీలా పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలి.. అనుకుంటారు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండండి.. అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా తాను షేర్ చేసిన తాజా ఫొటో ప్రతి ఒక్కరినీ చాలా ఆకట్టుకుంటోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…