Anasuya : బుల్లితెరపై యాంకర్గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్ని, మూమెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంకర్ అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.
అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫొటోలతో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. కానీ కొద్దిరోజులుగా డ్యాన్స్ వీడియోలతో దర్శనమిస్తూ రచ్చ చేస్తుంది. మహేశ్ బాబు ఒక్కడు మూవీలోని నువ్ ఏ మాయ చేశావో గానీ అనే పాటకు స్టెప్పులేసింది ఆకట్టుకుంది. అయితే తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఆమె తన బెడ్ రూమ్ లో బెడ్ పై పడుకొని తన పక్కన భర్త లేని విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకుంటున్నాను అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
బెడ్ పై పడుకున్నా అనసూయ పక్కన ఖాళీగా ఉన్న భరద్వాజ్ ప్లేస్ ని చూపిస్తూ.. ఆ వీడియోకి కామెంట్ చేస్తూ.. ఇంట్లో ఆయన లేకపోతే గుడ్ నైట్ నాకు నేనే చెప్పుకోవాలి. ఒంటరిగా నిద్రపోవాల్సి వస్తుంది అంటూ రాసుకొచ్చింది. దీంతో అనసూయ ఫ్యాన్స్ సైతం మండి పడుతున్నారు. ప్రైవేట్ వీడియోని పబ్లిక్ గా పోస్ట్ చేయడం అవసరమా అనసూయ అని కొందరంటుంటే.. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు అనసూయ.. నువ్వు ఇలాంటి విషయాలు షేర్ చేయకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వకు అంటూ హితబోధ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటే.. ఇవన్నీ అనసూయకు మాములేలే అని కొందరు లైట్ తీసుకుంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…