Anasuya : బుల్లితెరపై యాంకర్గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్ని, మూమెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంకర్ అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.
అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫొటోలతో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. కానీ కొద్దిరోజులుగా డ్యాన్స్ వీడియోలతో దర్శనమిస్తూ రచ్చ చేస్తుంది. మహేశ్ బాబు ఒక్కడు మూవీలోని నువ్ ఏ మాయ చేశావో గానీ అనే పాటకు స్టెప్పులేసింది ఆకట్టుకుంది. అయితే తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఆమె తన బెడ్ రూమ్ లో బెడ్ పై పడుకొని తన పక్కన భర్త లేని విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకుంటున్నాను అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
బెడ్ పై పడుకున్నా అనసూయ పక్కన ఖాళీగా ఉన్న భరద్వాజ్ ప్లేస్ ని చూపిస్తూ.. ఆ వీడియోకి కామెంట్ చేస్తూ.. ఇంట్లో ఆయన లేకపోతే గుడ్ నైట్ నాకు నేనే చెప్పుకోవాలి. ఒంటరిగా నిద్రపోవాల్సి వస్తుంది అంటూ రాసుకొచ్చింది. దీంతో అనసూయ ఫ్యాన్స్ సైతం మండి పడుతున్నారు. ప్రైవేట్ వీడియోని పబ్లిక్ గా పోస్ట్ చేయడం అవసరమా అనసూయ అని కొందరంటుంటే.. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు అనసూయ.. నువ్వు ఇలాంటి విషయాలు షేర్ చేయకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వకు అంటూ హితబోధ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటే.. ఇవన్నీ అనసూయకు మాములేలే అని కొందరు లైట్ తీసుకుంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…