Jio Laptop : టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జియో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనూ అడుగు పెట్టింది. జియో ఫోన్ పేరిట ఇప్పటికే పలు మోడల్స్ మార్కెట్లో విజయవంతంగా అమ్ముడవుతున్నాయి. అయితే త్వరలోనే జియో ల్యాప్టాప్ కూడా రిలీజ్ కానుంది. కేవలం రూ.15వేలకే దీన్ని అందించనున్నట్లు సమాచారం. ఇందులో 4జి సిమ్ వేసుకునే విధంగా స్లాట్ను ఇస్తారని తెలుస్తోంది. అందులో జియో సిమ్ను ఇన్బిల్ట్గా అందిస్తారని తెలుస్తోంది.
జియో అందించనున్న ల్యాప్టాప్ను భారత్లోనే స్థానికంగా తయారు చేయనున్నారు. ఇందుకు గాను క్వాల్కామ్తో జియో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. జియో తన 4జి ల్యాప్టాప్పై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మరో మూడు నెలలో ఈ ల్యాప్ టాప్ను లాంచ్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో హెచ్పీ, డెల్, లెనోవో కంపెనీలు ల్యాప్టాప్లను అందించడంలో టాప్ ప్లేస్లలో ఉన్నాయి. అయితే జియో తన 4జి ల్యాప్టాప్ను లాంచ్ చేస్తే ఈ మార్కెట్ షేర్ మరో 15 శాతం మేర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో తన 4జి ల్యాప్టాప్ను ఈ నెలలోనే లాంచ్ చేస్తుందని సమాచారం.
జియో ల్యాప్టాప్లను ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లో అందించి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారని తెలుస్తోంది. ఆ తరువాతే వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ల్యాప్టాప్ ధర కేవలం రూ.15వేలుగా ఉంటుందని తెలుస్తోంది. దీని వల్ల ల్యాప్టాప్ రంగంలో జియో విప్లవాత్మకమైన మార్పును తెచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ల్యాప్టాప్లో జియో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందేని సమాచారం. ఇందులో జియో స్టోర్ను అందిస్తారని తెలుస్తోంది. అందులోనే యాప్స్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కాగా వచ్చే మూడు నెలల్లో.. అంటే.. డిసెంబర్ చివరి నాటికి జియో ల్యాప్ టాప్లు రిలీజ్ అయినా.. వచ్చే ఏడాది వేసవి వరకు సుమారుగా 1 లక్ష ల్యాప్టాప్లను అమ్మడమే జియో లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. అయితే జియో 4జి ల్యాప్టాప్లు గనుక రిలీజ్ అయి నిజంగానే వినియోగదారులకు రూ.15వేలకు లభిస్తే.. అప్పుడు ల్యాప్టాప్ రంగంలో జియో సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. మరి అది నిజమవుతుందా.. లేదా.. అనేది చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…