Jio Laptop : టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జియో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనూ అడుగు పెట్టింది. జియో ఫోన్ పేరిట ఇప్పటికే పలు మోడల్స్ మార్కెట్లో విజయవంతంగా అమ్ముడవుతున్నాయి. అయితే త్వరలోనే జియో ల్యాప్టాప్ కూడా రిలీజ్ కానుంది. కేవలం రూ.15వేలకే దీన్ని అందించనున్నట్లు సమాచారం. ఇందులో 4జి సిమ్ వేసుకునే విధంగా స్లాట్ను ఇస్తారని తెలుస్తోంది. అందులో జియో సిమ్ను ఇన్బిల్ట్గా అందిస్తారని తెలుస్తోంది.
జియో అందించనున్న ల్యాప్టాప్ను భారత్లోనే స్థానికంగా తయారు చేయనున్నారు. ఇందుకు గాను క్వాల్కామ్తో జియో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. జియో తన 4జి ల్యాప్టాప్పై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మరో మూడు నెలలో ఈ ల్యాప్ టాప్ను లాంచ్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో హెచ్పీ, డెల్, లెనోవో కంపెనీలు ల్యాప్టాప్లను అందించడంలో టాప్ ప్లేస్లలో ఉన్నాయి. అయితే జియో తన 4జి ల్యాప్టాప్ను లాంచ్ చేస్తే ఈ మార్కెట్ షేర్ మరో 15 శాతం మేర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో తన 4జి ల్యాప్టాప్ను ఈ నెలలోనే లాంచ్ చేస్తుందని సమాచారం.
జియో ల్యాప్టాప్లను ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లో అందించి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారని తెలుస్తోంది. ఆ తరువాతే వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ల్యాప్టాప్ ధర కేవలం రూ.15వేలుగా ఉంటుందని తెలుస్తోంది. దీని వల్ల ల్యాప్టాప్ రంగంలో జియో విప్లవాత్మకమైన మార్పును తెచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ల్యాప్టాప్లో జియో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందేని సమాచారం. ఇందులో జియో స్టోర్ను అందిస్తారని తెలుస్తోంది. అందులోనే యాప్స్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కాగా వచ్చే మూడు నెలల్లో.. అంటే.. డిసెంబర్ చివరి నాటికి జియో ల్యాప్ టాప్లు రిలీజ్ అయినా.. వచ్చే ఏడాది వేసవి వరకు సుమారుగా 1 లక్ష ల్యాప్టాప్లను అమ్మడమే జియో లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. అయితే జియో 4జి ల్యాప్టాప్లు గనుక రిలీజ్ అయి నిజంగానే వినియోగదారులకు రూ.15వేలకు లభిస్తే.. అప్పుడు ల్యాప్టాప్ రంగంలో జియో సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. మరి అది నిజమవుతుందా.. లేదా.. అనేది చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…