Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద అనసూయ స్పందిస్తుంటుంది. అది కాంట్రవర్సీకి దారి తీస్తుంది. దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రోలర్ల మీద అనసూయ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇదొక సర్కిల్లా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ట్రోలింగ్ ఎంత జరుగుతున్నా కూడా అనసూయ మాత్రం వెనక్కి తగ్గదు. అలా అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది.
తాజాగా అనసూయ తనకు జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఇందులో ఎయిర్ పోర్ట్లో విమానాయాన సంస్థ చేసిన పనుల గురించి పేర్కొంది. బెంగుళూరు నుండి హైదరాబాద్ కి అనసూయ కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణమయ్యింది. దీనికోసం ఆమె ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంది. టికెట్ లో ఉన్న సమయం కంటే ముందే ఎయిర్ పోర్ట్ కి రావాలని ఎయిర్ లైన్ సంస్థ వారు సందేశం పంపారట. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్క్ లు లేవని లోపలి పంపలేదట.
మాస్క్ లు ధరించి ఫ్లైట్ లోపలికి వెళ్లగా.. సీట్లు ఒకచోట కాకుండా వేరువేరుగా కేటాయించారట. వరుసగా సీట్లు బుక్ చేస్తే వేరు వేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగితే సమాధానం లేదట. పైగా అనసూయ కూర్చున్న సీటు సరిగా లేదట. చిరిగిపోయి ఉండటం వలన పదునైన వస్తువు తాకి ఆమె చొక్కా చిరిగి పోయిందట. ఎయిర్ పోర్ట్ తో పాటు ఫ్లైట్ లో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులు వివరిస్తూ అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. మరి అనసూయ సందేశానికి సదరు ఎయిర్ లైన్స్ సంస్థ సమాధానం ఇస్తారో లేదో చూడాలి..
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…