Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్గా తన ప్రస్థానం మొదలు పెట్టిన అనసూయ నెమ్మదిగా సినిమాల్లోనూ యాక్ట్ చేయడం ప్రారంభించింది. తరువాత ఆమెకు వరుస ఆఫర్లు రాసాగాయి. ఆమె నటించిన చిత్రాలు హిట్ అవుతుండడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో నటిగా కూడా అనసూయ తానేంటో నిరూపించుకుంది. అయితే ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదమైన పోస్టు పెట్టి వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి ఈమె నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఇంతకీ అసలు ఏమైందంటే..
మార్చి 8వ తేదీన మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి మొదలుకొని సామాన్యుల వరకు అందరూ మహిళలను కీర్తిస్తున్నారు. అయితే అనసూయ మాత్రం తనకు వుమెన్స్ డే అసలు పట్టనట్లు పోస్టు పెట్టింది. కొందరు మగాళ్లు అలాగే ఉన్నారు.. అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది.
మహిళా దినోత్సవం రోజే కొందరు మగాళ్లకు మహిళలు గుర్తుకు వస్తారు. ఆరోజు వారు మహిళలను పూజిస్తూ మర్యాద ఇస్తారు. అది కేవలం 24 గంటలే. ఆ తరువాత యథావిధిగా వారు మహిళలను విమర్శిస్తూ వేధింపులకు గురి చేస్తుంటారు.. కనుక ఇది హ్యాప్పీ వుమెన్స్ డే కాదు.. హ్యాప్పీ ఫూల్స్ డే.. అని అనసూయ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్టుకు కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ మగాళ్లందరూ ఒక్కటే అని అనుకుంటుందని.. ఆమె అనుకుంటున్నది తప్పని.. సమాజంలో మగాళ్లు అందరూ ఒకేలా ఉండరని.. ఆమెకు చురకలు అంటించారు. ఈ క్రమంలోనే ఆమె పోస్టు వైరల్గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…