Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్గా తన ప్రస్థానం మొదలు పెట్టిన అనసూయ నెమ్మదిగా సినిమాల్లోనూ యాక్ట్ చేయడం ప్రారంభించింది. తరువాత ఆమెకు వరుస ఆఫర్లు రాసాగాయి. ఆమె నటించిన చిత్రాలు హిట్ అవుతుండడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో నటిగా కూడా అనసూయ తానేంటో నిరూపించుకుంది. అయితే ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదమైన పోస్టు పెట్టి వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి ఈమె నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఇంతకీ అసలు ఏమైందంటే..
మార్చి 8వ తేదీన మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి మొదలుకొని సామాన్యుల వరకు అందరూ మహిళలను కీర్తిస్తున్నారు. అయితే అనసూయ మాత్రం తనకు వుమెన్స్ డే అసలు పట్టనట్లు పోస్టు పెట్టింది. కొందరు మగాళ్లు అలాగే ఉన్నారు.. అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది.
మహిళా దినోత్సవం రోజే కొందరు మగాళ్లకు మహిళలు గుర్తుకు వస్తారు. ఆరోజు వారు మహిళలను పూజిస్తూ మర్యాద ఇస్తారు. అది కేవలం 24 గంటలే. ఆ తరువాత యథావిధిగా వారు మహిళలను విమర్శిస్తూ వేధింపులకు గురి చేస్తుంటారు.. కనుక ఇది హ్యాప్పీ వుమెన్స్ డే కాదు.. హ్యాప్పీ ఫూల్స్ డే.. అని అనసూయ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్టుకు కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ మగాళ్లందరూ ఒక్కటే అని అనుకుంటుందని.. ఆమె అనుకుంటున్నది తప్పని.. సమాజంలో మగాళ్లు అందరూ ఒకేలా ఉండరని.. ఆమెకు చురకలు అంటించారు. ఈ క్రమంలోనే ఆమె పోస్టు వైరల్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…