Poonam Kaur : నటి పూనమ్ కౌర్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. వివాదాస్పద పోస్టులు పెడుతూ వాటిని వెంటనే తీసేస్తోంది. దీంతో ఆమె పెట్టే పోస్టులు వైరల్గా మారుతున్నాయి. తన జీవితాన్ని ఒక వ్యక్తి, ఒక దర్శకుడు నాశనం చేశారని.. ఇప్పటికే ఆమె పలు సార్లు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మరోసారి మీడియా ఎదుట ఇదే విషయాన్ని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతం అయింది.
పూనమ్కౌర్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం నాతి చరామి. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. దీన్ని ఏకంగా 20 ఓటీటీల్లో స్ట్రీమ్ చేయనున్నారు. అందులో భాగంగానే నిర్వహించిన మీడియా సమావేశంలో పూనమ్ కౌర్ కన్నీటి పర్యంతం అయింది. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కలలతో వచ్చానని.. కానీ కొందరు రావణాసురులు తన కలను నాశనం చేశారని.. పూనమ్ కౌర్ కన్నీరు పెట్టుకుంది. కొందరు తన జీవితాన్ని నాశనం చేశారని ఆమె వ్యాఖ్యలు చేసింది. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూనే ఆమె భావోద్వేగానికి గురైంది. దీంతో పక్కనున్న వారు ఆమెను ఓదార్చారు. తన జీవితాన్ని కొందరు నాశనం చేసినందునే ఈ రోజున తాను సీత, దుర్గ, ద్రౌపదిలను తలచుకుని ధైర్యం చేసి జీవిస్తున్నానని తెలియజేసింది. అయితే ఓ దశలో సినిమాలను వదిలేసి ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిపోదామని అనుకున్నానని.. కానీ ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి తనకు ఈ సినిమా కథ చెప్పిందని.. ఇందులో మహిళ ప్రాధాన్యత అంశం ఉంటుందని చెప్పిందని.. అందుకనే నాతి చరామి సినిమాలో నటించానని తెలియజేసింది. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…