KA Paul : కేఏ పాల్ గత ఎన్నికల సమయంలో ప్రజా శాంతి పార్టీ పేరుతో ఒక్కసారిగా రచ్చ చేశారు. ఎన్నికల తర్వాత కనుమరుగైన పాల్ తాజాగా ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం తాను ప్రధానమంత్రి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉండగా తాజాగా పుష్ప సినిమా గురించి కేఏ పాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పుష్ప సినిమా విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. ఇప్పటికీ ఎంతో మంది ఈ సినిమాలో బాగా ఫేమస్ అయిన పాటలకు రీల్స్ చేయడం, అలాగే తగ్గేదే లే.. అని డైలాగులు చెబుతూ ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎంతో మంది క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు పుష్ప డైలాగులు చెబుతూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పుష్ప క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది.
తాజాగా కేఏ పాల్ కూడా తగ్గేదేలే.. అంటూ పుష్ప డైలాగ్స్ చెప్పడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ ఆ సినిమా ఏంటో.. ఆ యవ్వారం ఏందో నాకు తెలియదు. ఎవరో ముగ్గురు వచ్చి ప్రజాశాంతి పార్టీకి అభిమానులని ఈ డైలాగులు చెబితే పార్టీకి ఫండ్ ఇస్తామని చెప్పడంతో చెప్పాను. ఇంత వరకు అడ్రెస్ లేరంటూ పాల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఎవరో ఏంటో తెలియకుండా వారెవరో చెప్పమనగానే అలా డైలాగ్స్ చెప్పేయడమేనా.. వెర్రి బకరా.. అయ్యావుగా.. అని కొందరు నెటిజన్లు కేఏ పాల్పై కామెంట్లు చేస్తున్నారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…