Allu Arjun : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో ఐకాన్ స్టార్గా మారాడు. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు బన్నీ. తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టైలిష్ స్టార్ మరోవైపు వాణిజ్య ప్రకటనలతోనూ కోట్లు గడిస్తున్నాడు. ఇప్పటికే పలు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కో యాడ్కు రూ.7.50 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ను ఓ గుట్కా అండ్ లిక్కర్ కంపెనీ కూడా వినియోగించుకోవాలనుకుందట. తమ సంస్థ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఏకంగా రూ.10 కోట్ల పారితోషకం ఇస్తామని ఆఫర్ చేశారట. అయితే ఐకాన్ స్టార్ మాత్రం ఆ యాడ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడట. జనాల ఆరోగ్యానికి హానికరం కలిగించే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశం లేని బన్నీ ఆ భారీ ఆఫర్ను ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇలాంటి యాడ్స్లో నటిస్తే అభిమానులతోపాటు ఆడియన్స్లో కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని బన్నీ ముందు జాగ్రత్తగా ఆ సంస్థలకు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ నిర్ణయంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో తమ హీరోది మంచి మనసంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దేవిశ్రీప్రసాద్ సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. పుష్ప ది రూల్ పేరుతో మొదటి భాగం కంటే మరింత గ్రాండ్ గా సుకుమార్ ఈ సీక్వెల్ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కాస్త ఆలస్యమైనా సరే పక్కాగా వెళ్లాలని సుకుమార్ భావిస్తున్నాడట. మొదటి భాగంలో నటించిన వారితోపాటు విజయ్ సేతుపతి కూడా జత కావడంతో.. ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…