Allu Aravind : గత కొన్నేళ్లుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి , మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు ముగింపు వచ్చినట్టుగానే అనిపిస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. అల్లు అర్జున్ 6 సంవత్సరాల క్రితం ఒక సినిమా వేడుక లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి వారి డిమాండ్ కి బదులుగా చెప్పను బ్రదర్ అని సంభోదించడం జరిగింది. ఇక అప్పుడు మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పుష్ప సినిమా పాన్ ఇండియా సక్సెస్ తర్వాత అది తారా స్థాయికి చేరింది.
మెగా అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక వర్గం వారు చిరంజీవికి హీరో రామ్ చరణే అసలైన నట వారసుడని ఆయనకి మద్దతుగా ఉండగా, కొందరు అల్లు అర్జున్ కి మాత్రమే అభిమానులమని చెబుతున్నారు. రియల్ మెగాస్టార్ ఎవరనే విషయంలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతున్నాయి.
ఇక అల్లు అరవింద్ ఒక న్యూస్ ఛానల్ ఇంటర్య్వూలో ఇరువురి కుంటుంబాలపై వస్తున్న అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కి దేవుడితో సమానమని అది చివరి శ్వాస వరకు ఉంటుందని అన్నారు. ఇంకా ఆయన విభేదాల గురించి మాట్లాడుతూ.. రెండు కుటుంబాలలో మంచి నటులు ఉన్నారని, విజయవంతం కూడా అయ్యారని అన్నారు. అంతే కాకుండా సినిమాల పరంగా పోటీ ఉంటుందని, కానీ ఫ్యామిలీ విషయం వచ్చేసరికి వారంతా ఒక్కటే అని వివరణ ఇచ్చారు. ఇకనైనా అభిమానులు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటారో.. లేదో.. చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…