Sesame Seeds Laddu : భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లోనే కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పొడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. నువ్వులలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మం, ఎముకలు, జుట్టుకు చాలా మంచిది. నువ్వులు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. నువ్వులు కాలేయం, చర్మానికి కూడా మేలు చేస్తాయి.
నువ్వులలో ముఖ్యంగా కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కొత్త ఎముకలను నిర్మించడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బాడీలో ఐరన్ సమపాళ్లలో లేనప్పుడు రక్తహీనత సంభవిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. అన్నిటికీ టాబ్లెట్లు వాడే బదులు ఇంట్లోనే ఐరన్ సంబంధిత పదార్థాల ద్వారా బ్లడ్ లెవల్స్ పెంచుకోవచ్చు. తెల్ల నువ్వుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
అలాగే బెల్లం. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వాల్ నట్స్లో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి ఈ మూడు పదార్థాలు కలిపి లడ్డూలా తయారు చేయాలి. ఒక కప్పు నువ్వులను దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఒక కప్పు వాల్ నట్స్ ను కూడా పొడి చేయాలి. తగినంత బెల్లం తీసుకుని మూడు కలిపి కొద్దిగా ఆవునెయ్యి కలిపి లడ్డూలు చేయాలి. వీటిని రోజుకొకటి తింటూ ఉంటే రక్తహీనతను తొలగించి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లల ఎదుగుదలకు కూడా తోడ్పడుతాయి. కనుక వీటిని రోజూ తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…