PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె అందుకున్న పతకాలు భారతదేశ ఖ్యాతిని పెంచాయి. ఇటీవల కామన్వెల్త్ 2022 గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రతిష్టాత్మక పోటీల్లో స్వర్ణం గెలుపొందిన తొలి తెలుగు తేజంగా కీర్తి పొందింది. తాజాగా పీవీ సింధు ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన ఫేవరేట్ హీరో, తనకు వచ్చిన ప్రేమలేఖలు వంటి తదితర ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇక షోలో ఆలీతో సింధు బాగానే సందడి చేసినట్లు కనిపిస్తోంది. ఆలీ మీకు నచ్చిన హీరో ఎవరని అడిగితే చాలామంది హీరోలు నచ్చుతారు అని సమాధానం ఇచ్చింది సింధు. వెంటనే ఆలీ ఎవరైనా ఒకరి పేరు చెప్పు అనడంతో ప్రభాస్ అని చెప్పింది సింధు. ఇక మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అని కూడా చెప్పింది. దీంతో అలీ ఏంటి ఇద్దరు ఒకటే హైట్ అని ఇష్టమా అంటూ సరదాగా కామెంట్ చేయడంతో సింధు తెగ నవ్వింది. భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా ? అన్న అప్రశ్నకు ఏమో.. నా బయోపిక్ కూడా ఉండొచ్చేమో ! అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది పీవీ సింధు.
అలాగే తనకు చదువుకునే రోజుల నుంచే లవ్ లెటర్లు వచ్చేవంటూ.. మా ఫ్యామిలీ మెంబర్సే అవి చదువుతారని నవ్వుతూ చెప్పింది. ఒకానొక సమయంలో 70 ఏళ్ల వ్యక్తి ప్రేమలేఖ రాసి, తనను పెండ్లి చేసుకోకపోతే కిడ్నాప్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపింది. మెడల్ తీసుకునేప్పుడు చేతిలో మన జాతీయ జెండా ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది ? అని ఆలీ అడిగిన ప్రశ్నకు.. విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి అని ఎమోషనల్ అయ్యింది సింధు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…