PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె అందుకున్న పతకాలు భారతదేశ ఖ్యాతిని పెంచాయి. ఇటీవల కామన్వెల్త్ 2022 గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రతిష్టాత్మక పోటీల్లో స్వర్ణం గెలుపొందిన తొలి తెలుగు తేజంగా కీర్తి పొందింది. తాజాగా పీవీ సింధు ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన ఫేవరేట్ హీరో, తనకు వచ్చిన ప్రేమలేఖలు వంటి తదితర ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇక షోలో ఆలీతో సింధు బాగానే సందడి చేసినట్లు కనిపిస్తోంది. ఆలీ మీకు నచ్చిన హీరో ఎవరని అడిగితే చాలామంది హీరోలు నచ్చుతారు అని సమాధానం ఇచ్చింది సింధు. వెంటనే ఆలీ ఎవరైనా ఒకరి పేరు చెప్పు అనడంతో ప్రభాస్ అని చెప్పింది సింధు. ఇక మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అని కూడా చెప్పింది. దీంతో అలీ ఏంటి ఇద్దరు ఒకటే హైట్ అని ఇష్టమా అంటూ సరదాగా కామెంట్ చేయడంతో సింధు తెగ నవ్వింది. భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా ? అన్న అప్రశ్నకు ఏమో.. నా బయోపిక్ కూడా ఉండొచ్చేమో ! అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది పీవీ సింధు.
అలాగే తనకు చదువుకునే రోజుల నుంచే లవ్ లెటర్లు వచ్చేవంటూ.. మా ఫ్యామిలీ మెంబర్సే అవి చదువుతారని నవ్వుతూ చెప్పింది. ఒకానొక సమయంలో 70 ఏళ్ల వ్యక్తి ప్రేమలేఖ రాసి, తనను పెండ్లి చేసుకోకపోతే కిడ్నాప్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపింది. మెడల్ తీసుకునేప్పుడు చేతిలో మన జాతీయ జెండా ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది ? అని ఆలీ అడిగిన ప్రశ్నకు.. విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి అని ఎమోషనల్ అయ్యింది సింధు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…