Alia Bhatt : బాలీవుడ్ నటి ఆలియా భట్ ఈ మధ్య కాలంలో సౌత్ చిత్రాలపై దృష్టి సారించిన విషయం విదితమే. అందులో భాగంగానే ఆమె ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ తేజ్ పక్కన సీతగా నటించింది. అందులో ఆమె పాత్ర నిడివి కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలిసింది. అయినప్పటికీ ఆమె ఏకంగా రూ.5 కోట్ల మేర పారితోషికం తీసుకుందని సమాచారం.
ఇక త్వరలో ఎన్టీఆర్తో కొరటాల శివ చేయబోయే సినిమాలోనూ ఆలియాను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. దీంతో ఈ భామ దక్షిణాదిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతుంది. అయితే ఆమె హిందీలో నటించిన గంగూబాయి కతియవాడి సినిమా ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
గంగూబాయి కతియవాడి మూవీని ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఆమె నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ అప్పుడు విడుదల అవుతుంది కనుక తాను నటించిన ఒక సినిమానే ఇంకో సినిమాకు పోటీ అవుతుందని భావించిన చిత్ర యూనిట్ గంగూబాయిని ఫిబ్రవరికి వాయిదా వేయించారు.
అయితే ప్రస్తుతం గంగూబాయి సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. జీ5, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ సంస్థలు ఈ మూవీకి చక్కని ఆఫర్లను అందిస్తున్నాయట. దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మూవీని థియేటర్ల కన్నా ఓటీటీలో విడుదల చేస్తేనే బాగుంటుందని ఆలోచిస్తున్నదట. అందువల్ల ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…