India vs West Indies : అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఈ క్రమంలోనే ఆ జట్టుపై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో జేసన్ హోల్డర్ (57) మినహా ఎవరూ రాణించలేదు. ఇక భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణకు 2, మహమ్మద్ సిరాజ్ కు 1 వికెట్ దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 28 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (60), సూర్య కుమార్ యాదవ్ (34)లు రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్ 2 వికెట్లు తీయగా.. హొసెయిన్కు 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…