Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంతకు సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆమెను ఇప్పటికీ ఈ విషయంపై నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏది చేసినా.. సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా.. దానికి నెటిజన్లు నెగెటివ్గానే స్పందిస్తున్నారు. అయితే సమంత వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్లు, విమర్శలు, ట్రోల్స్పై స్పందించింది. సోషల్ మీడియా అంటే ప్లస్లు, మైనస్లు ఉంటాయని, అయితే అన్నింటినీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఏదీ శాశ్వతం కాదని, ఒక వారం అయితే అంతా మరిచిపోతారని పేర్కొంది.
ప్రస్తుతం తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నానని, తనకు కావల్సినంత స్పేస్ లభిస్తుందని సమంత తెలియజేసింది. తాను మాట్లాడినప్పుడు అది తన సైలెన్స్ కన్నా బాగుంటుందని చెప్పింది. తనకు ఎదురవుతున్నవన్నీ తాత్కాలిక సమస్యలేనని తెలియజేసింది.
కాగా సమంత విడాకుల విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె అవేమీ పట్టించుకోకుండా తన కెరీర్లో తాను బిజీగా ఉంది. ఇక సమంత త్వరలోనే కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీలో కనిపించనుండా.. యశోద అనే పాన్ ఇండియా ప్రాజెక్టులోనూ అలరించనుంది. అలాగే ఆమె నటించిన శాకుంతలం మూవీ కూడా ఇటీవలే షూటింగ్ను పూర్తి చేసుకుంది. దీంతో త్వరలోనే ఈ మూవీ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సమంత ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుందని తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…