Akkineni Amala : చాలాకాలం తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ కు తల్లిగా నటించి అందరిచేత కంటతడి పెట్టించింది అమల అక్కినేని. అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు అమల నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అమల కూడా పాల్గొంటోంది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. 2014 లో మనం చిత్రంలో డాన్స్ టీచర్ గా అతిథి పాత్రలో కనిపించిన అమల మరలా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.
తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అమల. శివ చిత్రంలో నాగార్జునకు భార్యగా నటించిన అమల నిజజీవితంలో కూడా నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చిత్రాలకు దూరమై కుటుంబ బాధ్యతలను అంకితమైపోయింది. అఖిల్ పుట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ భర్త నాగార్జున బిజినెస్ లో సహాయం చేస్తూ సమయం గడుపుతుంది.
ఒకే ఒక జీవితం చిత్రంలో హీరో శర్వానంద్ తల్లిగా అమల కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా సక్సెస్ అందుకున్న సందర్భంగా అమల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా అమల మాట్లాడుతూ ఈ చిత్రంలో ఉన్న విధంగా టైం మిషన్ లోకి వెళ్లే అవకాశం వస్తే నేను పదేళ్ల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని.. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను కౌగిలించుకొని ఒక్కసారిగా ఏడ్చేసిందని అమల చెప్పుకొచ్చారు.
ఇక నాగార్జున గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నా సక్సెస్ లో ఎప్పుడు భాగమై ఉంటారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ నాగార్జునతో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటారా అని అడగ్గా.. మేము ఇంట్లో కలిసే ఉంటాం. మళ్ళీ స్క్రీన్ పై కూడానా.. వద్దు.. అంటూ నవ్వుతూ జవాబు ఇచ్చింది. అమల ఈ ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్న తన అనుభవాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…