Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత టైం పడుతుంది. అదే కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్పతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దీంతో బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది.
త్వరలోనే బాలీవుడ్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన గుడ్బై సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను అనే మూవీకి కూడా సైన్ చేసింది. త్వరలో అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ సెట్స్లో ఎంట్రీ ఇవ్వనుంది ఈ అందాల భామ. అయితే ప్రస్తుతం రష్మిక రెమ్యూనరేషన్పై నెట్టింట చర్చ జరుగుతోంది. పుష్ప 2 కోసం పారితోషికం పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి ఏకంగా రూ.4 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తుంది.
అదేవిధంగా ఇక నుంచి చేసే ప్రతి సినిమాకు కూడా రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీపం ఉండగానే.. ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను రష్మిక బాగానే ఫాలో అవుతుందని నెటిజన్లు అంటున్నారు. పుష్ప విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 6 మిలియన్లకు పైగా ఫాల్లోవర్స్ ఉన్నారు. రష్మిక నటించిన సీతారామం ఇటీవల విడుదల కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రష్మిక ప్రస్తుతం తమిళ తలపతి విజయ్ తో వారసుడు, బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ లో నటించనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…