Akhanda Pre Release Event : అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ రంగానికి అండగా నిలవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా.. దాదాపుగా రెండేళ్ల పాటు టాలీవుడ్ ఇబ్బందుల్లో పడిందని.. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు వస్తున్నాయని చెప్పిన బాలయ్య.. అందరు హీరోల సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు. ప్రభుత్వాల అండతో.. సినీ రంగం కోలుకోవాలని అన్నారు.
స్పీచ్ మొదట్లో తనకు అలవాటైన రీతిలో శ్లోకాలు, బీజాక్షరాలు, నవ విధాన పూజలను అలవోకగా పఠించారు. ఈ క్రమంలో తనపై తానే జోక్ విసురుకున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో షో చేస్తున్నానని, ఇదే విధంగా భవిష్యత్తులో ఓ భక్తి చానల్లో ప్రవచనాల తరహాలో ఓ షో చేస్తానని చమత్కరించారు. ఒక్కో మాట కలిస్తే అక్షరం అవుతుంది. అక్షరాలు కలిస్తే మంత్రం అవుతుంది. మంత్రాల ఔన్నత్యాన్ని, నవ పూజల విశిష్టతను చాటిచెప్పే చిత్రమిది. భక్తితత్వాన్ని ఎన్నో సినిమాలతో నాన్నగారు బతికించారు. ఆ పంథాను నమ్మి నేను చేసిన సినిమా ఇది.
నాన్న ఎన్టీఆర్ను నేను గురువుగా, దైవంగా భావిస్తా. ఆ తర్వాత నా అభిమానుల్ని ప్రేమిస్తాను. నా నుంచి ఏదీ ఆశించకుండా కష్టాల్లో నాకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తున్నది అభిమానులే. జయాపజయాల దైవాధీనాలు. విజయాలను చూసి గర్వపడను. పరాజయాల్ని చూసి ఏ రోజూ కృంగిపోను.
కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఈ సినిమా చేశాం. ‘అఖండ’తోపాటు అల్లు అర్జున్ ‘పుష్ప’, రామ్చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలు విజయవంతం కావాలి. సినీ పరిశ్రమకు అండగా నిలవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నా’ అని బాలకృష్ణ తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…